AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3వ వన్డే నుంచి రోహిత్ ఔట్.. లాస్ట్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?

Team India World Cup 2027 Plans: భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. కానీ జట్టు భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలించాల్సిన బాధ్యత కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఉంది. లార్డ్స్ వన్డేలో రోహిత్‌ను పక్కన పెట్టి చేసే ఈ సాహసోపేత ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

3వ వన్డే నుంచి రోహిత్ ఔట్.. లాస్ట్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?
Ind Vs Eng 3rd Odi Rohit Sharma Vs Goutam Gambhir
Venkata Chari
|

Updated on: Jul 17, 2026 | 8:41 AM

Share

Team India World Cup 2027 Plans: ఇంగ్లాండ్‌తో సిరీస్ విజేతను తేల్చే ఆఖరి వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను మూడో వన్డే నుంచి పక్కన పెట్టేందుకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సరికొత్త ప్రయోగాలకు వేదికగా లార్డ్స్ మైదానం..

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఇరు జట్లు ఒక్కో విజయంతో సమంగా ఉన్న తరుణంలో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగబోయే ఆఖరి పోరు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, వచ్చే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యం ఇప్పటి నుంచే విభిన్న కాంబినేషన్లను పరీక్షించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సంకేతాలు..

సిరీస్ ప్రారంభానికి ముందే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో ఆటగాళ్ల ప్రయోగాల గురించి కీలక సంకేతాలు ఇచ్చాడు. భవిష్యత్తు సవాళ్లను, ముఖ్యంగా దక్షిణాఫ్రికా వంటి పిచ్‌ల పరిస్థితులను తట్టుకునేలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టుకు మంచి లోతును తీసుకురావడమే తమ లక్ష్యమని గిల్ స్పష్టం చేశాడు. రెండో వన్డేలోనే అనారోగ్యంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను నాలుగో స్థానంలో ఆడించడం ఈ వ్యూహంలో భాగమే. ఒకవేళ ఆఖరి వన్డేకు రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే, ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి గిల్‌తో కలిసి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్‌గా ఆడిన తొమ్మిది వన్డేల్లోనే 495 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఇషాన్ కిషన్ సొంతం.

ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తేలిపోయిన హిట్‌మ్యాన్..

ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ శర్మ ఆటతీరు ఎంతో నిరాశజనకంగా సాగుతోంది. పవర్‌ప్లే ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే రోహిత్, ఇంగ్లాండ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయలేక ఒత్తిడికి లోనవుతున్నాడు. మొదటి వన్డేలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో అవుట్ కాగా, రెండో వన్డేలో 47 బంతులు ఎదుర్కొని కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కనీసం 25 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లలో రోహిత్ కెరీర్‌లోనే ఇది అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ కావడం విశేషం.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

2026 లో నిలకడలేని ప్రదర్శన..

రోహిత్ శర్మకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 30.12 సగటుతో కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధశతాబ్దం ఉంది. మేనేజ్‌మెంట్ అతనిని జట్టు నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, ప్రపంచకప్ ప్రయోగాల నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us