AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kranti Goud : ఊరంత మగరాయుడంటూ ఏడిపించారు.. కట్‌చేస్తే.. పాక్‎ను ఓడించి వాళ్ల నోర్లు మూయించిందిగా

తొలి ప్రపంచ కప్ ఆడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, పాకిస్తాన్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో బంతితో అదరగొట్టింది. బౌలింగ్‌కు ముందు, ఆమె బ్యాటింగ్‌లో కూడా చిన్న సహకారం అందించింది. 49వ ఓవర్‌లో ఒక ఫోర్, 50వ ఓవర్‌లో మరో ఫోర్ కొట్టి జట్టు స్కోరును పెంచింది. కానీ, ఆమె అసలైన మాయ బౌలింగ్‌లో చూపించింది.

Kranti Goud : ఊరంత మగరాయుడంటూ ఏడిపించారు.. కట్‌చేస్తే.. పాక్‎ను ఓడించి వాళ్ల నోర్లు మూయించిందిగా
Kranti Goud
Rakesh
| Edited By: Venkata Chari|

Updated on: Oct 06, 2025 | 7:58 AM

Share

Kranti Goud : నువ్వు అమ్మాయివి.. మగరాయుడిలా ఆ క్రికెట్ ఏంటి.. అని గ్రామస్తుల నుండి వచ్చిన విమర్శలను లెక్క చేయకుండా తన కలను సాకారం చేసుకున్న 22 ఏళ్ల యువతి ఇప్పుడు ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక వరల్డ్ కప్, ఒక భారత్-పాకిస్తాన్ మ్యాచ్, మరోసారి భారత్ విజయం – ఇది పురుషుల వరల్డ్ కప్‌లో 1992 నుండి కొనసాగుతున్న కథే. ఇప్పుడు మహిళల వరల్డ్ కప్‌లో కూడా ఇదే కథ పునరావృతమవుతోంది. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025లో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అదే ఫలితం కనిపించింది. ఇది 2022లో, 2009 నుండి నిరంతరం కొనసాగుతున్న కథ. టీం ఇండియా వరుసగా 5వ సారి ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈసారి టీం ఇండియా విజయం వెనుక 22 ఏళ్ల క్రాంతి గౌడ్ అనే యంగ్ ప్లేయర్ ఉంది. ఈమె తన మొదటి వరల్డ్ కప్ ఆడుతోంది.

టీమిండియాకు చెందిన 22 ఏళ్ల యువ పేసర్ క్రాంతి గౌడ్ పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. అయితే, ఆమె ప్రదర్శన కేవలం బౌలింగ్‌కే పరిమితం కాలేదు. భారత బ్యాటింగ్ సమయంలో 49వ ఓవర్‌లో బరిలోకి దిగిన ఈ యంగ్ ప్లేయర్ ఒక ఫోర్ కొట్టింది. ఆ తర్వాత 50వ ఓవర్‌లో మరోసారి బంతిని బౌండరీకి పంపింది. అయితే, క్రాంతి తన అసలు సత్తాను బౌలింగ్‌లో చూపించింది.

రేణుకా సింగ్‌తో కలిసి కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన క్రాంతి, మొదటి నుంచీ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేసింది. 8వ ఓవర్‌లో సదఫ్ షమ్స్‌ను అవుట్ చేసి తన మొదటి వికెట్‌ను తీసుకుంది. ఆ తర్వాత 12వ ఓవర్‌లో ఆలియా రియాజ్‌ను పెవిలియన్ చేర్చింది. తదుపరి వికెట్ కోసం టీమిండియా 16 ఓవర్లు వేచి ఉండాల్సి వచ్చింది, అప్పుడు మధ్యప్రదేశ్ నుండి వచ్చిన ఈ పేసర్ మరోసారి సక్సెస్ సాధించింది. పాకిస్తాన్ భాగస్వామ్యం బలంగా మారుతున్న సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రాంతిని మళ్లీ బౌలింగ్‌కు పిలిచింది. ఆమె మొదటి బంతికే నటాలియా పర్వేజ్‌ను అవుట్ చేసింది. ఈ విధంగా క్రాంతి 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను క్రాంతి గౌడ్‌కు తన మొదటి వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

క్రాంతి కథ భారతదేశంలోని లక్షలాది మంది మహిళల కథల మాదిరే ఉంటుంది. క్రికెట్ వంటి క్రీడలో ఆడపిల్లలు ఆడటంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొనే వేలాది మంది అమ్మాయిలలో క్రాంతి ఒకరు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామం నుండి వచ్చిన క్రాంతి తన ఆరుగురు తోబుట్టువులలో చిన్నది. అయితే ప్రస్తుతం తన గ్రామానికి అత్యంత పేరు తీసుకొస్తున్నది మాత్రం ఆమెనే. ఒకానొక సమయంలో క్రికెట్‌ను ఎంచుకున్నందుకు ఆమెకు, ఆమె కుటుంబానికి గ్రామస్తుల నుండి చాలా నిందలు ఎదురయ్యాయి. అమ్మాయివై క్రికెట్ ఎందుకు ఆడతావు అని కూడా అడిగేవారు.

అయితే, క్రాంతికి తన కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించింది. ఆమె తండ్రి పోలీసు అధికారిగా ఉన్నప్పటికీ, ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. తన గ్రామంలోని పెద్ద అన్నయ్యలు క్రికెట్ ఆడటం, ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ చేయడం చూసి క్రాంతి కూడా దీన్నే తన ఆశగా మార్చుకుంది. అక్కడి నుండి క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే, ఏ కోచ్ సహాయం పొందకముందే క్రాంతి ఒక లోకల్ టోర్నమెంట్‌లో తన సత్తా చాటింది.

ఒక ఇంటర్వ్యూలో క్రాంతి మాట్లాడుతూ, స్థానిక టోర్నమెంట్‌లో అమ్మాయిల రెండు జట్లు ఉండేవని, వాటిలో ఒక జట్టులో క్రీడాకారులు తక్కువ ఉన్నారని చెప్పింది. క్రాంతి కూడా ఆ మ్యాచ్ చూడటానికి వెళ్లింది. అక్కడ ఎవరో ఆమెను ఆడమని అడిగారు. వెంటనే తను కాదనలేదు. ఆ తర్వాత జరిగిందంతా అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రాంతి ఆ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టడంతో పాటు 25 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇక్కడి నుండే ఒక అకాడమీ నడుపుతున్న కోచ్ రాజీవ్ బిల్ఠారే క్రాంతి టాలెంటును గుర్తించి.. కొలంబోలో పాకిస్తాన్‌ను ఓడించిన ఈ స్టార్‌గా ఆమెను తీర్చిదిద్దారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..