AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: కోహ్లీ సారథ్యంలో విక్టరీ హీరోలు.. కట్‌చేస్తే.. రోహిత్ కెప్టెన్సీలో జీరోలు.. కెరీర్ క్లోజ్.. ఇక రిటైర్మెంటే గతి..

Indian Cricket Team: టీమ్ ఇండియాకు బిగ్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన కొంతమంది ఆటగాళ్లకు ఇప్పుడు తిరిగి జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ ఆటగాళ్లు విరాట్ కెప్టెన్సీలో భారత్‌కు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు.

Team India: కోహ్లీ సారథ్యంలో విక్టరీ హీరోలు.. కట్‌చేస్తే.. రోహిత్ కెప్టెన్సీలో జీరోలు.. కెరీర్ క్లోజ్.. ఇక రిటైర్మెంటే గతి..
Team India
Venkata Chari
|

Updated on: Aug 01, 2023 | 6:32 AM

Share

Team India: గత కొన్నేళ్లుగా భారత టెస్టు జట్టులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. జట్టు కమాండ్ రోహిత్ శర్మ చేతిలో ఉండడంతో చాలా మంది యువ ఆటగాళ్లకు ఆడే అవకాశం దక్కుతోంది. ఈ మార్పుల కారణంగా జట్టులో అవకాశం దక్కించుకోవడం కష్టంగా మారిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఆటగాళ్లను విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బిగ్ మ్యాచ్ విన్నర్లుగా పరిగణించారు. అయితే ఇప్పుడు ఈ ఆటగాళ్లు భారత జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నారు.

100కి పైగా టెస్టులు ఆడిన వారికి చోటు దక్కడం లేదు..

టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ నవంబర్ 2021లో ఆడాడు. ఇప్పుడు ఇషాంత్ శర్మ జట్టులోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. ఇషాంత్ శర్మ భారత్ తరపున 105 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతని పేరు మీద 311 వికెట్లు ఉన్నాయి. టీమ్ ఇండియాలో ఇప్పుడు యువ బౌలర్లు అతని స్థానాన్ని ఆక్రమించారు.

ఈ వికెట్ కీపర్ కెరీర్ క్లోజ్..

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా కోసం కూడా జట్టు తలుపులు మూసుకుపోయాయి. ఇప్పుడు అతనికి జట్టులో స్థానం కల్పించడం అసాధ్యం. టీమ్ ఇండియా సెలక్టర్లు రిషబ్ పంత్, కెఎస్ భరత్ మొదటి ఎంపికగా నిలిచారు. దీని కారణంగా వృద్ధిమాన్ సాహాకు జట్టులో స్థానం లభించదు. టీమ్ ఇండియా తరపున 40 టెస్టులాడి 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

జట్టులో చోటు కోసం కష్టపడుతున్నన ఆటగాళ్లు..

29 ఏళ్ల హనుమ విహారి కూడా జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. హనుమ విహారి గత ఏడాది జులైలో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తరపున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హనుమ విహారి తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌ నుంచి మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. విహారి ఇప్పటివరకు 16 టెస్టులాడిన టీమిండియా తరుపున 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు.

మరిన్ని   క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..