AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువరాజ్ సింగ్ ట్వీట్లో ఎలాంటి తప్పు లేదు.. అతడిపై అత్యున్నత గౌరవం ఉందంటున్న టీమ్ ఇండియా ప్లేయర్..

మొతేరాలో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే మ్యాచ్‌ ముగియడంతో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్‌

యువరాజ్ సింగ్  ట్వీట్లో ఎలాంటి తప్పు లేదు.. అతడిపై అత్యున్నత గౌరవం ఉందంటున్న టీమ్ ఇండియా ప్లేయర్..
uppula Raju
|

Updated on: Feb 27, 2021 | 11:56 PM

Share

మొతేరాలో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే మ్యాచ్‌ ముగియడంతో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడం టెస్టు క్రికెట్‌కు మంచిదని కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా ఇలాంటి పిచ్‌లపై అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ చేసుకుంటే 800 లేదా 1000 వికెట్లు సులువుగా సాధించేవాళ్లని అన్నాడు. ఏదేమైనా అక్షర్‌ పటేల్‌కు అభినందనలు. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అశ్విన్‌, ఇషాంత్‌కు శుభాకాంక్షలు’ అని యువీ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన టీం ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వరుస ట్వీట్లు చేశాడు. అయితే వాటి గురించి తెలియజేస్తూ అసలు విషయాలను మీడియాకు వెల్లడించాడు.

యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ తనకేమీ తప్పుగా అనిపించలేదని, అతడి ట్వీట్‌లో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు లేవని పేర్కొన్నాడు. కెరీర్లో చాలాకాలం అతడితో కలిసి ఆడానని వెల్లడించాడు. అతడి పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని స్పష్టం చేశాడు. నా ట్వీట్లు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని ఉద్దేశించినవి కావని, తాను యువీ ట్వీట్‌ చూసినప్పుడు తనకేమి అనిపించలేదని, అది చూశాక తానేదో స్పందించాలని అనుకోలేదని అన్నాడు. అది సాధారణ ట్వీట్‌లాగే కనిపించిందని, అందులో నాకు తప్పేమీ కనిపించలేదని చెప్పాడు. చాలాకాలంగా నాకు యువీ తెలుసని, ఆయనను తానెంతో గౌరవిస్తానని, మనలో ఉన్న కొందరు అవతలి వ్యక్తులు ఏది చెప్పినా నమ్మేస్తారని అలా ఎందుకు చేస్తారో నాకర్థం కాదని అన్నాడు.

మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా ఆ మైలురాయి చేరుకున్న రెండో బౌలర్‌గా యాష్‌ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టులు) ఉన్నాడు. ఈ సారి కూడా పిచ్ అనుకూలిస్తే మరోసారి అభిమానులు అశ్విన్ నుంచి మంచి ప్రదర్శన చూడవచ్చు. టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్‌ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరు సన్నద్ధం అవుతున్నారు. కచ్చితంగా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తామని ధీమాగా ఉన్నారు.

CARONA: మీరు కళ్లజోడు పెట్టుకుంటారా..! అయితే కరోనా సోకదు..? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధకులు..

Follow Us
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో