AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్.. ఛార్జ్ తీసుకునేది ఎప్పుడంటే?

Dinesh Karthik Appointed Captain Of Team India: కార్తీక్ 2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 2022లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడిన ఈ అనుభవజ్ఞుడిని తిరిగి మైదానంలోకి చూడటం అభిమానులు ఆనందంగా ఉంటుంది.

Team India: టీమిండియా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్.. ఛార్జ్ తీసుకునేది ఎప్పుడంటే?
Dinesh Karthik
Venkata Chari
|

Updated on: Sep 23, 2025 | 3:52 PM

Share

Dinesh Karthik Appointed Captain Of Team India: భారత మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మెంటర్ దినేష్ కార్తీక్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను మరోసారి టీమిండియా మాజీ స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి మైదానంలో కనిపించనున్నాడు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే హాంకాంగ్ సిక్స్‌స్ 2025 కోసం కార్తీక్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

కెప్టెన్ అయిన తర్వాత కార్తీక్ స్పందన..

కార్తీక్ మార్గదర్శకత్వంలో, RCB గత సీజన్‌లో మొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది. అతను తన అంతర్జాతీయ అనుభవం, కెప్టెన్సీ నైపుణ్యాలు, తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టు పనిని సులభతరం చేయగలడు. కెప్టెన్‌గా నియమితులైన తర్వాత, కార్తీక్ మాట్లాడుతూ, “ఇంత గొప్ప చరిత్ర, ప్రపంచ గుర్తింపు కలిగిన టోర్నమెంట్ అయిన హాంకాంగ్ సిక్సెస్‌లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది. ఇంత అద్భుతమైన రికార్డులు కలిగిన ఆటగాళ్ల బృందానికి నాయకత్వం వహించాలని నేను ఎదురు చూస్తున్నాను” అని తెలిపాడు.

కార్తీక్ కెరీర్..

కార్తీక్ 2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 2022లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడిన ఈ అనుభవజ్ఞుడిని తిరిగి మైదానంలోకి చూడటం అభిమానులు ఆనందంగా ఉంటుంది. అతను 257 ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. 3,577 పరుగులు చేశాడు. కార్తీక్‌కు ఐపీఎల్‌లో అనేక జట్లకు ఆడిన అనుభవం ఉంది. అతను ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

ఇవి కూడా చదవండి

కార్తీక్ టోర్నమెంట్‌కు ఎలా తోడ్పడతాడు?

టోర్నమెంట్‌కు కార్తీక్ అందించిన సహకారం గురించి క్రికెట్ హాంకాంగ్ చైర్మన్ బుర్జీ ష్రాఫ్ వ్యాఖ్యానిస్తూ, “హాంకాంగ్ సిక్సర్స్ 2025 కోసం టీమ్ ఇండియా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్‌ను స్వాగతిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. అతని నాయకత్వం, అనుభవం పోటీకి అపారమైన విలువను జోడిస్తాయి. అతని ఉనికి ఈ అద్భుతమైన క్రికెట్ పండుగను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకర్షిస్తుందని మేం విశ్వసిస్తున్నాం” అని అన్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..