AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: అతడే గేమ్‌చేంజర్‌! 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక మైండ్ గేమ్ ని బయటపెట్టిన దిగ్గజ స్పిన్నర్

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎంఎస్ ధోని వ్యూహాత్మక నిర్ణయాలు భారత విజయానికి కీలకంగా మారాయి. ఇషాంత్ శర్మను తిరిగి దాడిలోకి తీసుకురావడం, చివరి ఓవర్ స్పిన్నర్ అశ్విన్‌కు అప్పగించడం వంటి ధైర్య నిర్ణయాలు మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చాయి. రవిచంద్రన్ అశ్విన్ ధోని వ్యూహాలకు ఇంకా ఆశ్చర్యపడుతుండగా, దినేష్ కార్తీక్, ఆకాష్ చోప్రా ధోనిని అమోఘ నాయకుడిగా ప్రశంసించారు. 2013 విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో మహత్తరమైన అధ్యాయంగా నిలిచింది.

MS Dhoni: అతడే గేమ్‌చేంజర్‌! 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక మైండ్ గేమ్ ని బయటపెట్టిన దిగ్గజ స్పిన్నర్
Dhoni
Narsimha
|

Updated on: Feb 15, 2025 | 9:45 AM

Share

2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు విజయాన్ని సాధించడంలో ఎంఎస్ ధోని వ్యూహాత్మక ప్రతిభ కీలక పాత్ర పోషించింది. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌గా మార్చబడింది. భారత్ 129 పరుగుల లక్ష్యాన్ని సమర్థంగా కాపాడుకోవడంతో ధోని నాయకత్వం అందరి ప్రశంసలు అందుకుంది.

భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ధోని వ్యూహాలను ఇప్పటికీ ఆశ్చర్యంగా భావిస్తాడు. ఫైనల్ సందర్భంగా జోనాథన్ ట్రాట్‌ను అవుట్ చేయడంపై ధోని ఇచ్చిన సలహా గురించి అశ్విన్ ఇలా చె  ప్పాడు. “ధోని నా దగ్గరికి వచ్చి, ‘ట్రాట్‌కు స్టంప్స్ మీదుగా బౌలింగ్ చేయవద్దు; వికెట్ చుట్టూ బౌలింగ్ చేయండి. అతను లెగ్ సైడ్‌లో ఆడటానికి ప్రయత్నిస్తాడు. బంతి తిరిగితే, స్టంప్ అవుట్ అవుతాడు’ అన్నాడు. ఇది ఎలా ఊహించాడో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను” అని అన్నాడు.

భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ధోనిపై ప్రశంసలు కురిపిస్తూ “ఇది టీం ఇండియా అసలైన పోరాట స్ఫూర్తిని చూపించింది. ఇంగ్లాండ్ చాలా దగ్గరగా వచ్చింది, కానీ ధోని వ్యూహాత్మక నిర్ణయాలు మ్యాచ్‌ను మలుపుతిప్పాయి” అని అన్నాడు.

క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా అయితే, ధోనిని మరింతగా కొనియాడాడు. “ఇది పూర్తిగా ధోని టోర్నమెంట్. అతను జట్టును తన ఇమేజ్‌లో తీర్చిదిద్దాడు. ప్రతి నిర్ణయం అతనిదే. ఇది క్రికెట్ స్వర్గం రాసిన కథ” అని అన్నాడు.

ఫైనల్లో ఓ కీలక దశలో ఇషాంత్ శర్మ తొలి స్పెల్ అంతగా ప్రభావం చూపలేదు. అయితే, ధోని అతనిపై పూర్తి నమ్మకంతో తిరిగి దాడిలోకి తీసుకురావడం కీలక మలుపు తీసుకువచ్చింది. ధోని ఇచ్చిన సలహా మేరకు ఇషాంత్ తన బంతుల వేగాన్ని మార్చుకుని, ఇయాన్ మోర్గాన్ & రవి బొపారా వికెట్లను వరుసగా తీసుకోవడం మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చింది.

చోప్రా దీనిని ఇషాంత్ కెరీర్‌లోని అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ అని అభివర్ణించాడు. ధోని తాకినదంతా బంగారంగా మారుతుంది. ఇది నిజమైన మిడాస్ టచ్ అని ప్రశంసించాడు.

ధోని తీసుకున్న మరో సంచలన నిర్ణయం చివరి ఓవర్లో స్పిన్నర్ అశ్విన్‌కు బంతిని ఇవ్వడం. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం ధైర్యమైనది. అయితే, అశ్విన్ తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఐదు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిపించాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2011 ప్రపంచ కప్‌తో పోలిక

భారత మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, 2013 విజయం ప్రాముఖ్యతను వివరించాడు. “2011 ప్రపంచ కప్‌లో మేము నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయంగా నిలిచింది. ఇది మన క్రికెట్ వారసత్వానికి మరో గొప్ప అధ్యాయం.”

ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ధోని 2013లో రాసిన విజయగాధను మళ్ళీ భారత్ రిపీట్ చేయగలదా? అన్నది చూడాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us