AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: టీ20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్

భారత క్రికెట్‌లో శిఖర్ ధావన్ ది ప్రత్యేక స్థానం. తన సొగసైన బ్యాటింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అయితే ప్రస్తుతం ధావన్ కు గడ్డు కాలం నడుస్తోంది. అతని పరిస్థితి చూస్తుంటే భారత జట్టులో మళ్లీ చోటు దక్కడం కష్టమే.

IPL 2024: టీ20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్
Shikhar Dhawan
Basha Shek
|

Updated on: May 17, 2024 | 5:19 PM

Share

భారత క్రికెట్‌లో శిఖర్ ధావన్ ది ప్రత్యేక స్థానం. తన సొగసైన బ్యాటింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అయితే ప్రస్తుతం ధావన్ కు గడ్డు కాలం నడుస్తోంది. అతని పరిస్థితి చూస్తుంటే భారత జట్టులో మళ్లీ చోటు దక్కడం కష్టమే. మరోవైపు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు ధావన్. కానీ ఇక్కడ కూడా తన మ్యాజిక్ ప్రదర్శించలేకపోయాడు. మొదటి కొన్ని మ్యాచ్‌లు ఆడినా, ఆ తర్వాత గాయం కారణంగా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ కింగ్స్ పోరాటం కూడా ముగిసింది. దీంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత శిఖర్ ధావన్ ఏం చేస్తాడు? అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే త్వరలోనే ఒక కొత్త పాత్రలో కనిపించనున్నాడీ టీమిండియా ఓపెనర్. అతను ఒక టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.  తాజాగా దీనికి సంబంధించిన 50 సెకెన్ల ప్రోమో రిలీజైంది. ఇందులో ధావన్ తో పాటు అక్షయ్ కుమార్, రిషబ్ పంత్, హర్భజన్ సింగ్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ టాక్ షోకు ‘ధావన్ కరేంగే’ అని పేరు పెట్టారు. ప్రముఖ ఓటీటీ యాప్ జియో సినిమాలో మే 20 నుంచి ఈకామెడీ టాక్ షో అందుబాటులోకి రానుంది.

కాగా శిఖర్ ధావన్ వయసు ఇప్పుడు 38 ఏళ్లు. పేలవమైన ఫామ్ తో సుమారు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అతని కెరీర్ అనుకున్నంతగా లేదు. దీంతో పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలను సామ్ కుర్రాన్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ధావన్ ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాక్ షో వల్ల శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ ముగిసేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

శిఖర్ ధావన్ తరచుగా తన సోషల్ మీడియా ద్వారా తన ట్యాలెంట్ ను చూపిస్తున్నాడు. తరచూ కామెడీ రీల్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంటాడు. వీటికి అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు, కామెంట్లు వస్త్ఉంటాయి. కాబట్టి ఈ కామెడీ టాక్ షోలో శిఖర్ ధావన్ కచ్చితంగా రాణిస్తాడని అతని అభిమానులు అనుకుంటున్నారు. ఈ షోలో బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు హాజరుకానున్నారు.

ధావన్ కరేంగే టాక్ షో ప్రోమో చూశారా?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..