AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Champions Trophy 2025: హమ్మయ్య! రేపే ఛాంపియన్స్ ట్రోఫీపై ICC కీలక నిర్ణయం.. ఇప్పటికైనా ఈ గొడవ తీరేనా?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ ఆతిథ్యంపై విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించి, భారత మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించేందుకు సుముఖత చూపింది. ఐసీసీ బుధవారం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ICC Champions Trophy 2025: హమ్మయ్య! రేపే ఛాంపియన్స్ ట్రోఫీపై ICC కీలక నిర్ణయం.. ఇప్పటికైనా ఈ గొడవ తీరేనా?
Icc Champion Trophy
Narsimha
|

Updated on: Dec 10, 2024 | 4:34 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ ఆతిథ్యంపై కొనసాగుతున్న విభేదాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం ఒక కీలక నిర్ణయం ప్రకటించనుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ టోర్నమెంట్‌కు Champions Trophy కి సంబంధించిన హైబ్రిడ్ మోడల్‌ కోసం కొన్ని షరతులను విధించింది.

ఐసీసీ టోర్నమెంట్‌లకు సంబంధించి భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్‌ అనుసరించాల్సి ఉంటుందని PCB స్పష్టంచేసింది. దీనికి సంబంధించి ఐసీసీ నుంచి వ్రాతపూర్వక హామీ కోరింది. భారత ప్రభుత్వం అనుమతులు లేనందున భారత జట్టు పాకిస్తాన్‌లో ఆడేందుకు వెళ్ళదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, PCB హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించి, భారత మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో నిర్వహించబడతాయి. భారత జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.

ఈ ప్రతిపాదనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నిర్ణయం ముందుకువచ్చే ముందు, PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలసి ప్రభుత్వ అనుమతులను పొందే ప్రయత్నం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉంటుందని PCB గతంలోనే వెల్లడించింది.

ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం ఇది అనిశ్చితిలో పడిపోయింది. టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. అవి రెండు గ్రూపులుగా విభజించి, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లతో ముగుస్తుంది.

ఇదే తరహా సమస్య గతంలో ఆసియా కప్ 2023 సమయంలో కూడా ఎదురయ్యింది. భారత్ పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించడంతో, ఆ టోర్నమెంట్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. ఆ సమయంలో, భారత జట్టు తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడి, విజేతగా నిలిచింది.

ఈ సారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఇదే మోడల్ కొనసాగుతుందా, లేదా ఐసీసీ ఇతర పరిష్కారాలను పరిశీలిస్తుందా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.