AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: అనుకున్నదే జరిగిందిగా.. వర్షంతో తొలి సెషన్ రద్దు.. విఫలమైన భారత బౌలర్లు

Australia vs India, 3rd Test: బ్రిస్బేన్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత వర్షం ఎంట్రీ ఇచ్చింది. ఇలా మూడుసార్లు వర్షం పడడంతో తొలి సెషన్ తుడిచి పెట్టుకపోయింది.

IND vs AUS: అనుకున్నదే జరిగిందిగా.. వర్షంతో తొలి సెషన్ రద్దు.. విఫలమైన భారత బౌలర్లు
Ind Vs Aus 3rd Test Weather
Venkata Chari
|

Updated on: Dec 14, 2024 | 9:11 AM

Share

Border Gavaskar Trophy 2024: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో క్రికెట్ ప్రేమికులు భయపడినట్టే జరుగుతోంది. తొలిరోజు తొలి సెషన్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ పలుమార్లు నిలిచిపోయింది. వర్షం కారణంగా మొదటి సెషన్‌లో 13.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇంతలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, అతని నిర్ణయం సరైనదని భారత బౌలర్లు నిరూపించలేదు.

తొలి సెషన్‌పై వర్షం ప్రభావం..

అనుకున్న సమయానికి మ్యాచ్ ప్రారంభం కాగా, 5.3 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. భారీ వర్షం కారణంగా అరగంట పాటు మ్యాచ్‌ను నిలిపివేసి, ఆ తర్వాతే తిరిగి ప్రారంభించగలిగారు. ఆ తర్వాత, దాదాపు ఎనిమిది ఓవర్ల ఆట తర్వాత వర్షం తిరిగి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈసారి కూడా వర్షం విపరీతంగా కురవడంతో మ్యాచ్ పున:ప్రారంభం కాకపోవడంతో అరగంట సేపు వేచిచూసి తొలిరోజు లంచ్ ప్రకటించారు. ఈ విధంగా తొలి సెషన్‌లోనే దాదాపు 15 ఓవర్ల ఆట చెడిపోయింది. పిచ్‌తో పాటు మైదానం కూడా కప్పబడకపోవడంతో వర్షం ఆగిపోయినా ఆట ప్రారంభించడానికి సమయం పడుతుంది. అయినప్పటికీ, బ్రిస్బేన్ డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుంటుంది. కాబట్టి, దీనికి ఎక్కువ సమయం పట్టదు.

భారత్ పేలవమైన బౌలింగ్..

పిచ్‌పై పచ్చటి గడ్డిని చూసి, రోహిత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పిచ్ ప్రారంభంలో పూర్తిగా ఫ్లాట్‌గా కనిపించింది. బంతి పెద్దగా స్వింగ్ అవ్వడం లేదు. అదే సమయంలో భారత ఫాస్ట్ బౌలర్లు కూడా పేలవంగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లు స్టంప్ లైన్‌ను మిస్సయ్యారు. దాని కారణంగా వారు ఎటువంటి విజయం సాధించలేదు.

కొత్త బంతితో, జస్ప్రీత్ బుమ్రా ఆరు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో అతను మూడు మెయిడిన్లు వేశాడు. ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ, బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యాడు. ఈ టెస్టులో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ కూడా 3.2 ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను కూడా ప్రత్యేకంగా ఏమీ చేయడం కనిపించలేదు. మహ్మద్ సిరాజ్ కూడా నాలుగు ఓవర్లలో రెండు మెయిడీన్లు వేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..