IPL 2025 కొత్త షెడ్యూల్ ఇదేనా.. రీఎంట్రీలో తొలి మ్యాచ్లో తలపడే జట్లు ఏవంటే?
IPL 2025 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మెరుగైన నెట్ రన్ రేట్తో టాప్-1లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించాయి.

IPL 2025: భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టోర్నమెంట్ను దాదాపు వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. దీంతో అభిమానుల్లో ఓ ప్రశ్న మొదలైంది. IPL 2025లో మిగిలిన 16 మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2025 ఈ రోజున మళ్ళీ ప్రారంభం..
ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సైనిక వివాదం కారణంగా, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని IPL 2025 ను తాత్కాలికంగా వాయిదా వేయాలని BCCI నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నమెంట్ను కొనసాగించడం సముచితం కాదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
అదే సమయంలో, కొన్ని నెలల తర్వాత (జులై, ఆగస్ట్) ఐపీఎల్ 2025 మళ్ళీ ప్రారంభమవుతుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ పర్యటన, ఆసియా 2025 కప్ కోసం ఇప్పటికే కేటాయించిన సమయాన్ని ఉపయోగించి టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లను నిర్వహించడానికి BCCI ప్రయత్నించవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
మొదటి మ్యాచ్లో ఢీ కొట్టేది ఎవరంటే?
IPL 2025 మళ్ళీ ప్రారంభమైనప్పుడల్లా, మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. మే 8న, ధర్మశాలలో 58వ మ్యాచ్ కోసం రెండు జట్లు ఒకదానికొకటి తలపడాల్సి ఉంది. కానీ, పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా, ఎటువంటి ఫలితం లేకుండా మ్యాచ్ రద్దు చేశారు.
ఇటువంటి పరిస్థితిలో PBKS vs DC మ్యాచ్ను పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు మ్యాచ్ నిలిపివేయడానికి ముందు 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో..
IPL 2025 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మెరుగైన నెట్ రన్ రేట్తో టాప్-1లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించాయి.
పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుసగా మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇది కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ రేసులో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..