IND vs WI: విండీస్‌తో టెస్టులకు ఆరుగురు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ.. కీలక మార్పులకు బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్..

India Vs West Indies: భారత టెస్టు క్రికెట్ జట్టులోకి ముగ్గురు కొత్త బ్యాటర్లు, ముగ్గురు కొత్త బౌలర్లను తీసుకురావాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానే ఎక్కువ కాలం టెస్టులు ఆడడం అనుమానమే. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు.

IND vs WI: విండీస్‌తో టెస్టులకు ఆరుగురు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ.. కీలక మార్పులకు బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్..
Wi Vs Ind 2023

Updated on: Jun 23, 2023 | 7:50 AM

Team India: భారత క్రికెట్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ని వెస్టిండీస్‌తో ఆడనుంది. కరేబియన్‌లో పర్యటించనున్న టీమిండియా అక్కడ రెండు మ్యాచ్‌ల టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ఐలు ఆడనుంది. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించనుంది. దీని ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి ఎడిషన్ ప్రారంభం కానుంది.

ఇటీవల ముగిసిన రెండో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందువల్ల, తదుపరి ఎడిషన్ కోసం బలమైన జట్టును నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం బీసీసీఐ కొత్త ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

భారత టెస్టు క్రికెట్ జట్టులోకి ముగ్గురు కొత్త బ్యాటర్లు, ముగ్గురు కొత్త బౌలర్లను తీసుకురావాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానే ఎక్కువ కాలం టెస్టులు ఆడడం అనుమానమే. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డారు. అందుకే అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ వంటి యువ ఆటగాళ్లు వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారత బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు అవసరం. మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ సమీప భవిష్యత్తులో టెస్టుల నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా గాయపడ్డారు. కాబట్టి, భారత్‌కు ఫ్యూచర్ పేసర్లు ఎంతో అవసరం. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి కసరత్తులు చేయనుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..