AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది ఐర్లాండ్‌పై ఓడిపోయేందుకేనా.. పాకిస్తాన్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్లు..

Pakistan: మూడు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉంది. డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేయగా, దానికి సమాధానంగా ఐర్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ తన పూర్తి బలంతో ఈ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. అయినప్పటికీ పాక్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది.

Pakistan: ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది ఐర్లాండ్‌పై ఓడిపోయేందుకేనా.. పాకిస్తాన్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్లు..
Pakistan Vs Ireland T20i
Venkata Chari
|

Updated on: May 11, 2024 | 12:26 PM

Share

Pakistan Defeat vs Ireland: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటన సరిగ్గా ప్రారంభం కాలేదు. తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌తో ఓటమిని చవిచూసిన బాబర్ సేనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ ఆర్మీలో శిక్షణ పొందగా, ఇప్పుడు దీనిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మూడు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉంది. డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేయగా, దానికి సమాధానంగా ఐర్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ తన పూర్తి బలంతో ఈ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. అయినప్పటికీ పాక్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత, కెప్టెన్ బాబర్ ఆజం తన జట్టు ప్రదర్శనపై అసంతృప్తిగా కనిపించాడు. ఈ ఓటమికి జట్టు ఫీల్డింగ్, బౌలింగ్ కారణమని నేరుగా ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ట్రోల్స్..

అదే సమయంలో, సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టును లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..