AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగాల్సి ఉంది. దీనిపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ ఉంది.

Asia Cup 2025: ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?
Asia Cup 2025 Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Aug 03, 2025 | 7:58 AM

Share

India vs Pakistan: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఖరారైంది. ఈసారి టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?

టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మధ్య జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ Aలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో యూఏఈ, ఒమన్ కూడా ఉన్నాయి. మరోవైపు గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.

షెడ్యూల్ వివరాలు:

వేదికలు: దుబాయ్, అబుదాబి

ఇవి కూడా చదవండి

ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9, 2025

ఫైనల్ మ్యాచ్: సెప్టెంబర్ 28, 2025

భారత్ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ, దుబాయ్

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్, అబుదాబి

ఎందుకు యూఏఈలో?

సాధారణంగా ఆతిథ్య హక్కులు భారత్‌కు ఉన్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాలు ఒకరి గడ్డపై మరొకరు ఆడకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో, 2027 వరకు తటస్థ వేదికలపై మాత్రమే ఆడాలని బీసీసీఐ, పీసీబీ ఒప్పందం చేసుకున్నాయి. అందుకే ఈ టోర్నమెంట్ మొత్తం యూఏఈలో నిర్వహిస్తున్నారు.

మూడు మ్యాచ్‌‌ల్లో తలపడే ఛాన్స్..

ఈసారి ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఒక మ్యాచ్, ఆ తర్వాత రెండు జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తే మరో మ్యాచ్, ఆపై ఫైనల్‌కు చేరుకుంటే మూడో మ్యాచ్ కూడా జరగవచ్చు. ఈ మెగా టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు పాల్గొననున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల