AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: 36 పరుగులకే ఆలౌట్ అయిన టీం మీది..? టీమిండియాపై పైత్యం చూపించిన ఆసీస్ ప్లేయర్

India vs Australia 2nd Test: బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. డే అండ్ నైట్‌గా జరిగే ఈ మ్యాచ్‌లో గులాబీ రంగు బంతిని ఉపయోగించనున్నారు. అందుకే, ఈ మ్యాచ్‌ను పింక్‌ బాల్‌ టెస్ట్‌గా పిలుస్తున్నారు.

IND vs AUS: 36 పరుగులకే ఆలౌట్ అయిన టీం మీది..? టీమిండియాపై పైత్యం చూపించిన ఆసీస్ ప్లేయర్
Alex Carey
Venkata Chari
|

Updated on: Dec 03, 2024 | 8:36 PM

Share

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డిసెంబరు 6న అడిలైడ్‌లోని ఓవల్‌ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తీవ్ర సాధనలో నిమగ్నమయ్యాయి. ఈ ప్రాక్టీస్ సమయంలో, ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ అలెక్స్ కారీ విలేకరుల సమావేశంలో కనిపించాడు. ఈ సమయంలో అలెక్స్ కారీ మాట్లాడుతూ.. టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు. 2020లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. అది నాకు ఇంకా గుర్తుంది అంటూ క్యారీ చమత్కరించాడు.

అలాగే, టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ కావడం చారిత్రాత్మక ఘట్టం. ఇది మళ్లీ పునరావృతం కాదు. అయితే, ఈసారి కూడా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని అలెక్స్ కారీ తెలిపాడు.

ఎందుకంటే, స్వదేశంలో ఆడిన పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు అత్యుత్తమ రికార్డును కలిగి ఉంది. ఇందుకు మేం గర్విస్తున్నాం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో పునరాగమనం చేయబోతున్నామని అలెక్స్ కారీ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

36 పరుగులకు ఆలౌట్..

2020-21 బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. అడిలైడ్‌లోని ఓవల్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది.

దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును 191 పరుగులకే కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలీకృతులయ్యారు.

53 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే, టెస్టుల్లో అత్యల్ప స్కోరు చేసిన ప్రపంచంలో 4వ జట్టుగా టీమ్ ఇండియాకు అపఖ్యాతి ఏర్పడింది.

ఈ అవమానకర ఓటమిని ప్రస్తావిస్తూ.. అడిలైడ్ టెస్టులో ఈసారి కూడా ఆసీస్ విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీ జోస్యం చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..