AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: లార్డ్స్‌లో ఓడిపోయాక బ్రిటీష్ జట్టులో చాలా మార్పులు..! రాణించని ఇద్దరు ఆటగాళ్లపై వేటు.. టీ 20 నెంబర్‌ వన్ బ్యాట్స్‌మెన్‌తో ప్రయోగం..

India vs England: భారత్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు సభ్యులను ప్రకటించింది. ఇంగ్లీష్ జట్టులో ముఖ్యంగా రెండు మార్పులు చేశారు. బ్యాట్స్ మెన్ డోమ్ సిబ్లే, జాక్

India vs England: లార్డ్స్‌లో ఓడిపోయాక బ్రిటీష్ జట్టులో చాలా మార్పులు..! రాణించని ఇద్దరు ఆటగాళ్లపై వేటు.. టీ 20 నెంబర్‌ వన్ బ్యాట్స్‌మెన్‌తో ప్రయోగం..
India Vs England
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 19, 2021 | 6:50 AM

Share

India vs England: భారత్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు సభ్యులను ప్రకటించింది. ఇంగ్లీష్ జట్టులో ముఖ్యంగా రెండు మార్పులు చేశారు. బ్యాట్స్ మెన్ డోమ్ సిబ్లే, జాక్ క్రాలీని తొలగించారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ డేవిడ్ మలాన్, ఒల్లీ పోప్‌లను జట్టులో చేర్చారు. మలాన్ టీ 20 ఫార్మాట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు. అతను చివరిసారిగా 2018 లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. భారత్‌తో సిరీస్‌లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కెప్టెన్ జో రూట్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. డేవిడ్ మలన్ ఈ సంవత్సరం ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు అందులో అతను 199 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ కూడా జట్టులో చేరాడు. అతను ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. కానీ ఇటీవల కాలంలో అతని పనితీరు అద్భుతంగా ఉంది. అతను ఈ సంవత్సరం ప్రారంభంలో శ్రీలంక, భారతదేశ పర్యటన చేశాడు. సకీబ్ హెడింగ్లీ టెస్టులో అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ జట్టు నుంచి రిలీవ్‌ అయ్యాడు. కానీ మోయిన్ అలీకి స్టాండ్‌బైగా ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ భుజానికి గాయం అయితే అతడిని జట్టులో ఉంచారు. మూడో టెస్టు నాటికి ఫిట్‌గా ఉండాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. ఆగస్టు 25 నుంచి భారత్ -ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

సిబ్లే-క్రాలీ బాడ్ డోమ్ సిబ్లే, జాక్ క్రాలీ ఇద్దరూ భారత్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో విఫలమయ్యారు. క్రౌలీకి రెండో టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించలేదు. సిబ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. తన చివరి 15 టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే 35 పరుగుల మార్కును దాటాడు. అలాగే ఈ ఏడాది 10 టెస్టుల్లో అతని సగటు 19.77 మాత్రమే. మూడో టెస్టులో ఇంగ్లీష్ జట్టు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్‌లను ఓపెనర్లుగా పంపిస్తుంది. డేవిడ్ మలాన్‌ మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లాండ్ జట్టు.. జో రూట్ (క్యాప్ట్), జోస్ బట్లర్ (డబ్ల్యుకె), డేవిడ్ మలన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రెయిగ్ ఎవర్టన్, జేమ్స్ ఆండర్సన్, హసీబ్ హమీద్, ఒల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో, డాన్ లారెన్స్, ఒల్లీ రాబిన్సన్, రోరీ బర్న్స్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.

Minister Peddireddy: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు మరో ఎంపీ, ఎమ్మెల్యే

AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..