AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI world Cup 2023: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాకిచ్చిన బంగ్లా.. దెబ్బకు మారిన ప్లేస్..

Team India: 2011 తర్వాత తొలిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మహా సంగ్రామం అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి మొత్తం 8 జట్లు డైరెక్ట్ ఎంట్రీ పొందాయి.

ODI world Cup 2023: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాకిచ్చిన బంగ్లా.. దెబ్బకు మారిన ప్లేస్..
Team India
Venkata Chari
|

Updated on: May 17, 2023 | 6:43 PM

Share

2011 తర్వాత తొలిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్ (2023 World Cup)కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మహా సంగ్రామం అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి మొత్తం 8 జట్లు డైరెక్ట్ ఎంట్రీ పొందాయి. ఇందులో టీమ్ ఇండియాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొననుండగా, మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆడి ప్రపంచకప్‌లోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ పూర్తి కాగా, దీంతో వరల్డ్ కప్ సూపర్ లీగ్ టోర్నీ ముగిసింది. ఈ వరల్డ్ కప్ సూపర్ లీగ్ రౌండ్ (World Cup Supple League round) తర్వాత ఏ 8 జట్లు నేరుగా ప్రపంచకప్‌లోకి ప్రవేశిస్తాయో స్పష్టమైంది.

నాలుగో స్థానానికి పడిపోయిన టీమ్ ఇండియా..

ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో టీమిండియాను అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచకప్ సూపర్ లీగ్ పాయింట్ల జాబితాలో బంగ్లాదేశ్ మూడో స్థానానికి చేరుకోగా, అంతకుముందు మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది.

10 జట్ల మధ్య పోరు..

ముందుగా చెప్పినట్లుగా, ఈ ప్రపంచకప్‌లో 10 జట్లు ఆడనున్నాయి. నేరుగా టోర్నమెంట్‌లోకి ప్రవేశించిన 8 జట్లు మినహా మిగిలిన 2 జట్లను ప్రపంచకప్ క్వాలిఫయర్ రౌండ్‌లో నిర్ణయించనున్నారు. ఈ రౌండ్‌లో వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, ఒమన్, స్కాట్లాండ్, యూఏఈ, యూఎస్‌ఏతో సహా 10 జట్లు ఈ 2 స్థానాల కోసం పోరాడుతాయి. ఈ క్వాలిఫైయింగ్ రౌండ్ జూన్ 18 నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ ఏడాది ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌కు వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. అలాగే, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డారెన్ సమీని వన్డే, టీ20 ఫార్మాట్‌లకు కోచ్‌గా నియమించింది. డారెన్ సమీ నేతృత్వంలో వెస్టిండీస్‌కు రెండు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను అందించాడు. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించే బాధ్యత సమీపై ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..