CWG 2022: ఫైనల్లో పంచ్‌ల వర్షం.. ఇంగ్లండ్ బాక్సర్‌పై నీతూ ఘన విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

మహిళల 48 కేజీల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌పై నీతూ ఘన్‌ఘాస్‌ విజయం సాధించింది. తద్వారా దేశానికి బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని అందించింది.

CWG 2022: ఫైనల్లో పంచ్‌ల వర్షం.. ఇంగ్లండ్ బాక్సర్‌పై నీతూ ఘన విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
Cwg 2022 Nitu Ganghas
Follow us

|

Updated on: Aug 07, 2022 | 3:42 PM

బాక్సింగ్‌లో ఊహించినట్లుగానే నీతూ ఘన్‌ఘాస్‌ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. మహిళల 48 కేజీల  విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. భారత బాక్సర్ పంచ్‌లకు ఇంగ్లండ్ బాక్సర్ వద్ద సమాధానం లేదు. మూడు రౌండ్ల పాటు సాగిన బాక్సింగ్‌లో మొదటి నుంచి చివరి వరకు నీతూ సత్తా చాటింది. మూడు రౌండ్లలో ఇంగ్లీష్ బాక్సర్ కంటే న్యాయమూర్తులు నీతూకి ఎక్కువ పాయింట్లు ఇచ్చారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరపున నీతూ 14వ స్వర్ణం సాధించింది. ఇంగ్లిష్ బాక్సర్‌తో నీతూ చేసిన పోరాటం మూడు రౌండ్ల పాటు అద్భుతంగా సాగింది. ఇద్దరి మధ్య దూకుడు తారాస్థాయికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మూడు రౌండ్లలోనూ నీతూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రౌండ్‌లో ఐదుగురు జడ్జిలలో నలుగురు నీతూకి 10 పాయింట్లు ఇచ్చారు. రెండవ, మూడవ రౌండ్లలో కూడా ఇదే విధమైన ఫలితాలు కనిపించాయి. ఫలితంగా చివరికి న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు భారత బాక్సర్ నీతూకు అనుకూలంగా వచ్చింది.