CWG 2022: తొలిరోజే భారత్, పాకిస్తాన్ టీంల పోరాటం.. తలపడిన ప్రతీసారి టీమిండియాదే విజయం..

జులై 29 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో ఈవెంట్‌లు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు వివిధ క్రీడాంశాల్లో భారత్‌ సవాల్‌ ఎదుర్కోనుంది.

CWG 2022: తొలిరోజే భారత్, పాకిస్తాన్ టీంల పోరాటం.. తలపడిన ప్రతీసారి టీమిండియాదే విజయం..
India Vs Pakistan
Follow us

|

Updated on: Jul 28, 2022 | 9:11 AM

CWG 2022 India vs Pakistan: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 322 మంది సభ్యులతో కూడిన భారత బృందం బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. జులై 28న అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకలో ఒలింపిక్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత జెండా బేరర్‌గా వ్యవహరించనుంది. జులై 29 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆటల తొలిరోజు క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. కాగా, మొదటి రోజు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌ జరగనుంది.

బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు..

జులై 29న బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారత్ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్నారు. అయితే, క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పోటీపై ఉన్నంత ఆసక్తి.. బ్యాడ్మింటన్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ జట్టుపై ఆసక్తి లేదు..

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించలేదని పాకిస్థాన్ బ్యాడ్మింటన్ సమాఖ్య విశ్వసిస్తోంది. అందుకే జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది. అయితే, పాకిస్థాన్ ఒలింపిక్ సంఘం జోక్యంతో బర్మింగ్‌హామ్ వెళ్లేందుకు నలుగురు సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టుకు ర్యాంకింగ్స్‌లో టాప్ 175లో ఉన్న ఏకైక ఆటగాడు మహూర్ షాజాద్ నాయకత్వం వహించనున్నాడు. అతను మినహా మిగిలిన జట్టు ఆటగాళ్లు టాప్ 500లో కూడా లేకపోవడం గమనార్హం.

చివరిసారి భారత్ క్లీన్ స్వీప్..

మరోవైపు భారత జట్టులో సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ టాప్‌ జోడీగా నిలవనుంది. గాయత్రి, త్రిష జోలీ మహిళల డబుల్స్ విభాగంలోకి ప్రవేశించనున్నారు. మిక్స్‌డ్ కేటగిరీ గురించి మాట్లాడితే, సుమిత్ రెడ్డితో పాటు అనుభవం ఉన్న అశ్విని పొన్నప్ప కోర్టును ఆశ్రయించనున్నారు. చివరిసారి ఇరు జట్లు ముఖాముఖి తలపడగా భారత్ 5-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌ను భారత్ మూడో గేమ్‌కు వెళ్లనివ్వలేదు. దీంతో భారత్ సవాల్ ఎంత కఠినంగా ఉంటుందో అర్థమవుతోంది.

భారత్, పాకిస్థాన్ మధ్య బ్యాడ్మింటన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

జులై 29న భారత్, పాకిస్థాన్ మధ్య బ్యాడ్మింటన్ మ్యాచ్ జరగనుంది.

భారత్, పాకిస్థాన్ మధ్య బ్యాడ్మింటన్ మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే బ్యాడ్మింటన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

సోనీ నెట్‌వర్క్ ఛానెల్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే బ్యాడ్మింటన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ కానుంది. అలాగే సోనిలివ్ యాప్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..