Shravana Masam 2023: శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినరంటే.. దీని వెనక సైంటిఫ్ రీజన్ ఇదే..
శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరిచుకుంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పండుగ వాతావరణ నెలకొంటుంది. మనలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. శాకాహారానికే ప్రాధ్యాన్యం ఇవ్వడానికి కొన్న సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ మాసంలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయదు. మాంసం తింటే అనారోగ్యం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదే నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం మంచిది కాదన్న కారణంతో మాంసం తీసుకోరని చెబుతారు.

శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదవ నెల.. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంతో ఈ నెల మొదలవుతంది. అంటే చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు.. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసం వచ్చిందంటే వర్షఋతువు రావడం.. జోరుగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ నెలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వర్షాలు పడుతుండటం.. వ్యవసాయం మొదలు.. పండుగలు, శుభకార్యాలు అమ్మో ఇంటిల్లిపాది సందడిగా మారిపోతాయి.
శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరిచుకుంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పండుగ వాతావరణ నెలకొంటుంది. మనలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. శాకాహారానికే ప్రాధ్యాన్యం ఇవ్వడానికి కొన్న సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ మాసంలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయదు. మాంసం తింటే అనారోగ్యం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదే నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం మంచిది కాదన్న కారణంతో మాంసం తీసుకోరని చెబుతారు.
సనాతన ధర్మంలో మాంసాహారం నిషిద్ధం అయినప్పటికీ మనం అలా చేయకుండా ఉండలేకపోతున్నాం. గౌరవం, విశ్వాసానికి అంకితభావంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మాంసం తినడం మానుకోవాలని సూచించబడింది. శ్రీకృష్ణుడు శాకాహారాన్ని ఎంచుకున్నాడు: “ఎవరైనా నాకు ఒక ఆకు, పువ్వు, పండు లేదా నీటిని ప్రేమతో, భక్తితో సమర్పిస్తే.. నేను దానిని స్వీకరిస్తాను.” కృష్ణ జన్మాష్టమి, రక్షా బంధన్, నాగ్ పంచమి మరియు తీజ్ వంటి అనేక ఇతర ముఖ్యమైన హిందూ పండుగలు శ్రావణ మాసంలో వస్తాయి. దాని పవిత్రతను నింపుతుంది.
శాస్త్రీయ కారణాలు
వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి, మాంసాహారం తీసుకోకుండా ఉండటం మంచిది. సావన్ లేదా శ్రావణ వ్రతం సమయంలో, వ్యక్తులు తేలికైన చిరుతిళ్లను తీసుకుంటారు, అవి సులభంగా జీర్ణమవుతాయి. వర్షాకాలంలో కూడా నీటి వల్ల వచ్చే వ్యాధులు అనేకం. మరియు జంతువుల మాంసం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా, వర్షాకాలంలో దీనిని నివారించడం మంచిది.
జలచరాల సంతానోత్పత్తి
వర్షాకాలంలో చేపలు, ఇతర జలచరాలు సంతానోత్పత్తి చేస్తాయి. వర్షాకాలంలో జలచరాలు సంతానోత్పత్తికి రెడీ అవుతాయి. పొలాలు లేనప్పుడు ప్రజలు చేపలు, ఇతర రకాల సముద్రపు ఆహారాన్ని తినకుండా ఉండేవారు. శ్రావణం మతంలో ప్రేమగా, సాత్వికంగా ఉండే నెలగా కూడా పరిగణిస్తారు. హిందూ సంస్కృతిలో ఏదైనా జీవిని హత్య చేయడం అనైతికంగా పరిగణించబడుతున్నందున ప్రజలు నాన్-వెజ్ భోజనానికి దూరంగా ఉంటారు.
వర్షాకాలం, శ్రావణ మాసంలో మాంసాహార భోజనానికి దూరంగా ఉండడానికి ఇవి చాలా ప్రబలమైన కారణాలు. అయితే, శ్రావణంలో మాంసాహార వంటకాలను తినకూడదని కఠినమైన నియమాలు లేవు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగతంగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారు.
జీర్ణ వ్యవస్థ..
శ్రావణ మాసం వస్తూనే వర్షాన్ని తీసుకు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ యుగానికి ముందు ఈ సమయంలో సూర్యరశ్మిని స్వీకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మేఘాలు కమ్మేసి.. భానుడి కిరణాలు నేలను తాకడం తక్కువగా ఉంటుంంది. దీంతో మన శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
మానవ శరీరంభూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్నిలతో పంచభూతాలతో సహజ మూలకాలతో తయారైనందున.. దాని లోపం మన శరీర పనితీరును క్లిష్టతరం చేస్తుంది. మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. తద్వారా మన జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. నాన్ వెజ్ తినడం వల్ల శరీరం జీర్ణం కావడం కష్టమవుతుంది. అందుకే ప్రజలు ఎక్కువ తేలికైన, సాత్విక ఆహారాన్ని తినాలని భావిస్తారు.
వర్షం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు..
ఈ నమ్మకం వెనుక ఉన్న మరో ప్రధాన కారణం వర్షాకాలంలో వచ్చే నీటి ద్వారా వచ్చే వ్యాధులు. ఈ సమయంలో నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల మానవ శరీరం కూడా ఇబ్బంది పడుతుందనే నమ్మకం ఉంది. ఈ సీజన్లో కలరా, డెంగ్యూ, టైఫాయిడ్, దద్దుర్లు మొదలైన వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. అందుకే మిమ్మల్ని రిస్క్ లేకుండా ఉంచే వాటిని సురక్షితంగా తీసుకుంటారని భావిస్తారు.
రైతులకు చాలా ప్రత్యేకం
రుతుపవనాల సమయంలో అధిక వర్షపాతంత నమోదవుతుంది. దీంతో శ్రామికలు.. ముఖ్యంగా రైతులు ఇంటికే పరిమితం అవుతారు. కష్టపడి పనిచేసేవారికి వారకి ఈ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది.వర్షాకాలంలో తేలికపాటి శాఖాహార ఆహారంపై ఆధారపడటం ప్రారంభిస్తారు.
ఆధ్యాత్మిక కారణాలు
రక్షాబంధన్, తీజ్, కృష్ణ జన్మాష్టమి, నాగ పంచమి మొదలైన చాలా పండుగలు ఈ సీజన్లో వస్తాయి. ఈ రోజుల్లో గ్రామాల నుంచి పట్టణాల వరకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఇది కూడా ఓ కారణం..
శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..