AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: 11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షిక ఉత్సవాలు..కారణం ఇదేనట..!

మూడు రోజుల పాటు అంటే, జనవరి 11నుండి 13 వరకు జరిగే ఈ మహా క్రతువు కోసం ఆలయ ట్రస్టు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా సంగీత, కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు. జనవరి 22న రామ లల్లా మూర్తి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఆశ్చర్యకరంగా, ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని మాత్రం జనవరి 11న రామమందిరంలో జరిపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉందంటున్నారు వేద పండితులు, జ్యోతిష్యులు. ఆ ప్రకారం..

Ayodhya: 11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షిక ఉత్సవాలు..కారణం ఇదేనట..!
Ayodhya Ram Temple
Jyothi Gadda
|

Updated on: Jan 11, 2025 | 11:19 AM

Share

Ayodhya: కోట్లాది మంది హిందువుల విశ్వాసం.. రామ భక్తుల శతాబ్దాల కల నెరవేరిన సంఘటన అది.. గతేడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగిన రోజు.. దివ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన ఆ శుభ తరుణం.. ఇప్పుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు యోగి సర్కార్‌ నిశ్చయించింది. అంగరంగ వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పుడు ఈ వార్షికోత్సవాలను కూడా అంతే ఎత్తున నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ప్రారంభించి..రాంలాలకు మహాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఋషులు, సాధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు అంటే, జనవరి 11నుండి 13 వరకు జరిగే ఈ మహా క్రతువు కోసం ఆలయ ట్రస్టు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా సంగీత, కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు.

అయితే, జనవరి 22న రామ లల్లా మూర్తి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఆశ్చర్యకరంగా, ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని మాత్రం జనవరి 11న రామమందిరంలో జరిపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉందంటున్నారు వేద పండితులు, జ్యోతిష్యులు. ఆ ప్రకారం.. గతేడాది పుష్య (పౌష) శుక్ల ద్వాదశి నాడు అయోధ్యలో శ్రీ రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ శుభదినాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి’గా జరుపుకోవాలని రామజన్మభూమి ట్రస్టు పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం (2025) జనవరి 11న పుష్య శుక్ల ద్వాదశి. అలా ఈరోజు ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..