AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Temple: ఆ ముస్లిం దేశంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ సహకారంతో హిందూ ఆలయం నిర్మాణం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఈ హిందూ ఆలయం అబుదాబిలో మొట్టమొదటిది. ఈ ఆలయం 55,000 చదరపు మీటర్లలో నిర్మించబడింది. భారతీయ కళాకారులతో అందంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో 50,000కు పైగా ఇటుకలను ఉపయోగించారు. విశేషమేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో భారతదేశంలోని ప్రముఖ నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ కూడా సహకరించారు.

Hindu Temple: ఆ ముస్లిం దేశంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ సహకారంతో హిందూ ఆలయం నిర్మాణం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Hindu Mandir In Abu Dhabi
Surya Kala
|

Updated on: Dec 30, 2023 | 11:52 AM

Share

ఓ వైపు భారత దేశంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రధాని మోడీ ఆ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాన భూమికను పోషించనున్నారు. అదే సమయంలో అయోధ్యకు 2800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్లిం దేశంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ ముస్లిం దేశం అబుదాబి. ఇక్కడ నిర్మించిన BAPS హిందూ దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..  ఈ ఆలయాన్ని ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం

భారతదేశానికి దాదాపు 2800 కిలోమీటర్ల దూరంలోని అబుదాబిలో నిర్మిస్తున్న మొట్ట మొదటి హిందూ దేవాలయం.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ ఆలయం భారతదేశం ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయానికి కేంద్రంగా మాత్రమే కాకుండా.. ఈ ఆలయ నిర్మాణం కారణంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి.

ఈ హిందూ ఆలయం అబుదాబిలో మొట్టమొదటిది. ఈ ఆలయం 55,000 చదరపు మీటర్లలో నిర్మించబడింది. భారతీయ కళాకారులతో అందంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో 50,000కు పైగా ఇటుకలను ఉపయోగించారు. విశేషమేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో భారతదేశంలోని ప్రముఖ నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ కూడా సహకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆలయాన్ని స్వామినారాయణ సంస్థ (BAPS) నిర్మించింది. ఈ సంస్థ దేశ విదేశాల్లో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సహా 1,100 కంటే ఎక్కువ దేవాలయాలను నిర్మించింది.

ఆలయ విశిష్టత ఏమిటి?

ఈ భారీ ఆలయాన్ని నిర్మాణంలో భారత దేశంలోని వేద వాస్తు శిల్పం ఉపయోగించబడింది, ఈ ఆలయంలో ఉంచబడిన దేవతలు, దేవతల విగ్రహాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. అలాగే ఇందులో క్లిష్టమైన చెక్కడాలు, పాలరాతి రాళ్లను ఉపయోగించారు. ఈ దేవాలయం ఎత్తు దాదాపు 108 అడుగులు కాగా ఇందులో 180 వేల క్యూబిక్ మీటర్ల బుల్లా రాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు.

అబుదాబిలోని ఈ విలాసవంతమైన ఆలయం ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. వీటిలో ప్రతి శిఖరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో ఎగ్జిబిషన్ సెంటర్, తరగతి గదులు, ఆట స్థలం కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం 10 ఫిబ్రవరి 2025న ప్రారంభం కానుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం..
దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!