అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
పవిత్రమైన రామ నవమి పర్వదినం రోజున, నలుమూలల నుండి అయోధ్యలోని రామనగరికి విచ్చేసిన భక్తులు ఒక అసాధారణమైన క్షణానికి సాక్ష్యమిచ్చారు. శుక్రవారం (మార్చి 27) సరిగ్గా 12 గంటలకు, అయోధ్యలోని అద్భుతం చోటు చేసుకుంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై పడగానే, ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

పవిత్రమైన రామ నవమి పర్వదినం రోజున, నలుమూలల నుండి అయోధ్యలోని రామనగరికి విచ్చేసిన భక్తులు ఒక అసాధారణమైన క్షణానికి సాక్ష్యమిచ్చారు. శుక్రవారం (మార్చి 27) సరిగ్గా 12 గంటలకు, అయోధ్యలోని అద్భుతం చోటు చేసుకుంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై పడగానే, ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలో ఉన్న భక్తులు ఆనందంతో, ఉత్సాహంతో పొంగిపోయారు. ఆలయం లోపల ఉన్న రామ్ లల్లా విగ్రహం నుదుటిపైకి శాస్త్రీయ పద్ధతిలో సూర్యకిరణాన్ని ప్రసరింపజేశారు. ఆలయ ప్రాంగణమంతా “జై శ్రీ రామ్” నినాదాలతో మారుమోగింది. ఈ ఏడాది అయోధ్యలో జరుగుతున్న ఈ ఘనమైన వేడుకకు, రామ జన్మభూమి ఆలయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూర్య తిలకం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అద్దాలు, కటకాలతో కూడిన అధునాతన వ్యవస్థ ద్వారా, సూర్యకాంతి గర్భగుడిలోకి ప్రవేశించి కొన్ని నిమిషాల పాటు దేవతామూర్తి రామ్ లల్లా నుదుటిపై ప్రకాశవంతమైన తిలకాన్ని ఏర్పడింది. సూర్య తిలకం వేడుక సమయంలో, సూర్యకిరణాలు పైనుంచి గొట్టాల ద్వారా రామ మందిరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అవి అద్దాల ద్వారా పరావర్తనం చెంది, రామ్ లల్లా విగ్రహం నుదుటిపై 75 మిల్లీమీటర్ల వృత్తాకార తిలకాన్ని ఏర్పరుస్తాయి. ఈ వేడుక దైవిక ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలవడంతో పాటు, సంప్రదాయం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. భక్తుల భాగస్వామ్యం మరింత విస్తృతం చేసేందుకు, ఆలయ అధికారులు అయోధ్య వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు, దీంతో వేలాది మంది భక్తులు ఆ క్షణాన్ని వీక్షించేందుకు వీలు కలిగింది.
రామ్ లల్లాకు జరిగిన సూర్య తిలక్ ప్రదానోత్సవాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.రామ్ లల్లా సూర్య తిలకం దర్శనంతో పులకించిపోయారు. సూర్య తిలకం ప్రదానోత్సవాన్ని ప్రధాని అభినందించారు.
వీడియో ఇక్కడ చూడండి..
అంతకుముందు, చైత్ర నవరాత్రి అష్టమి సందర్భంగా, రామ జన్మభూమి ఆలయ సముదాయంలోని సూర్య దేవాలయంలో పురోహితులు వైదిక సంప్రదాయాల ప్రకారం “ధ్వజారోహణ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై “ఓం” చిహ్నం ఉన్న కాషాయ జెండాను ఎగురవేశారు. ఇక ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే అయోధ్యకు భక్తుల తాకిడి అధికంగా కనిపించింది. వేలాది మంది సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి, అపారమైన ఉత్సాహంతో ఈ మతపరమైన ఆచారాలలో పాల్గొన్నారు. పుణ్యస్నానం చేసిన అనంతరం, భక్తులు రామ మందిరంతో సహా పలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
