AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2021: దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..

Mysuru Dussehra 2021: కరోనా నిబంధనను పాటిస్తూ.. రెండో ఏడాది కూడా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ..

Dussehra 2021: దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..
Mysure Dasara
Surya Kala
|

Updated on: Oct 08, 2021 | 6:10 PM

Share

Mysuru Dussehra 2021: కరోనా నిబంధనను పాటిస్తూ.. రెండో ఏడాది కూడా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే  దసరా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను కర్ణాటక రాష్ట్రం ‘నాద హబ్బ’ (రాష్ట్ర పండుగ) గా జరుపుకుంటారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్సూ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.. సాంప్రదాయ దుస్తులను ధరించి ఖాసగి దర్బార్  ను నిర్వహించారు. బంగారు సింహాసనాన్ని అధిరోహించి.. వేద స్తోత్రాలు పఠించారు.  మైసూర్ లో దసర ఉత్సవాలు 2020 నాటికి ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 410 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ ఏడాది 411 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాయి.

మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు, పూజలు  ఊరేగింపులు దేశ విదేశీయులను సైతం ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు మైసూర్ వస్తున్నారు.  ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెట్ దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక అధరాలు లభ్యమయ్యాయి. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ మైసూర్ లోని దసరా ఉత్సవాలు గురించి రాసుకున్నారు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం మైసూరు రాజులైన ఉడయార్లు శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు.  దసరా ఉత్సవాల సమయంలో మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ సమయంలో మైసూర్ ను సందర్శించడానికి పర్యాటకులు అమితాశక్తిని చూపిస్తారు.

1805లో కృష్ణరాజ ఉడయార్ III దసరా ఉత్సవాలల్లో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది ఆచారంగా మారిపోయింది.. నేటికీ ప్రయివేట్ దర్భార్ ను వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు రాచఖడ్గాన్ని , ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలను నిర్వహిస్తారు. మహర్నవమి రోజున జరిగే ఉత్సవాలను చూడడానికి  భారీ సంఖ్యలో భక్తులు మైసూర్ ప్యాలెట్ కు , చాముండేశ్వరి ఆలయానికి చేరుకుంటారు.

Also Read:  దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. పూజారి ఛాతీపై 21 కలశాల స్థాపన.. ఎక్కడంటే..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?