AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam: కాణిపాకం వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి వెలంపల్లి భూమి పూజ.. అమెరికాకు చెందిన దాత రూ. 9 కోట్ల విరాళం

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి...

Kanipakam: కాణిపాకం వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి వెలంపల్లి భూమి పూజ.. అమెరికాకు చెందిన దాత రూ. 9 కోట్ల విరాళం
Kanipakam Temple
Surya Kala
|

Updated on: Jun 23, 2021 | 2:55 PM

Share

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రాచమంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.  ఆలయ మూషికమండపం, మంత్రాలయం, అద్దాలమండపం, గర్భగుడి చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాలని పడగొట్టి ప్రభుత్వం తిరిగి నిర్మించనున్నది. ఈ పునర్నిర్మాణ పనుల కోసం అమెరికాకు చెందిన దాత 9 కోట్ల రూపాయల నిధులను విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో ఆలయ పునర్మిణాన పనులు ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ..  చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని కాణిపాక ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం లో అన్ని దేవాలయాలను అభివృద్ధి  చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు..కొంత మంది రాజకీయ నాయకులు మతవిద్వేషాలు రాజకీయం చేస్తున్నారని వారికి దేవుడే బుద్ధి చెబుతారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

బహుదా నది ఒడ్డున వక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఇక్కడ సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఏ దేవుడి మీద ఒట్టు వేసినా నమ్మనివారు కూడా కాణిపాకం ఆలయ ఆవరణలో ఎవరైనా ప్రమాణం చేస్తే మాత్రం నమ్ముతారు. తరతరాలుగా సత్యప్రమాణాలు గల దేవునిగాచ భక్తుల పూజలు అందుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు. ఈ క్షేత్రానికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు

స్వామీ వారి ముందు ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం.

Also Read: మగువల మనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?