Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti 2023: భీష్మ పితామహుడు మకర సంక్రాంతి కోసం అంపశయ్య మీద ఎందుకు వేచి ఉన్నాడో తెలుసా..

కురుక్షేత్ర యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నడు. దీంతో కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, విజ్ఞానానికి నిలువెత్తు దర్పణం అయిన భీష్మాచార్యుడు.

Sankranti 2023: భీష్మ పితామహుడు మకర సంక్రాంతి కోసం అంపశయ్య మీద ఎందుకు వేచి ఉన్నాడో తెలుసా..
Sankranti
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2023 | 5:00 AM

హిందూ సనాతన ధర్మంలో సూర్యుడు ధనుస్సురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు.. మకర సంక్రాంతి వస్తుంది. మకర రాశికి అధిపతి శని గ్రహం.. సూర్యభగవానుడు వివిధ రాశులలో ప్రయాణించి మకర సంక్రాంతి రోజున తన తనయుడు ఇంటికి చేరుకుంటాడు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన అనంతరం.. నిలిచిన శుభ కార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. సూర్యుడు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాడు. మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు కదులుతుంది.. ఈ కదలికను ఆయనం అంటారు.  అందుకే ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందని చెబుతారు. సూర్యుడు మకర రాశి నుంచి మిధునరాశి వరకు ఆరు నెలల పాటు ఉత్తర దిశలో అయనీకరణం చేస్తాడు. తదుపరి ఆరు నెలల్లో.. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుస్సు రాశికి దక్షిణ దిశలో కదులుతాడు. దీనిని సూర్యుని దక్షిణాయనం అంటారు. సూర్యుడు ఉదయించగానే అన్ని శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.

పౌరాణిక కథ

పురాణాల కథనం ప్రకారం.. భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో పితామహుడు భీష్ముడు కౌరవుల తరపున పోరాడాడు. ఈ యుద్ధంలో అర్జునుడి రథానికి రథసారథి అయిన శ్రీ కృష్ణుడికి కూడా భీష్ముడు అజేయమైన యోధుడని.. అర్జునుడు తన పోరాట పటిమతో ఓడించలేడని తెలుసు. అయితే భీష్ముడు తాను ఏ స్త్రీపై దాడి చేయనని ప్రతిజ్ఞ చేసాడు. దీంతో శిఖండి సహాయంతో భీష్మ పితామహుడిపై బాణాలు కురిపించాడు అర్జునుడు. స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్న భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నడు. దీంతో కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, విజ్ఞానానికి నిలువెత్తు దర్పణం అయిన భీష్మాచార్యుడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి తానే ముహర్త సమయం నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భీష్మపితామహుడు 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం ఎదురు చూశాడు. మకర సంక్రాంతితో పాటు, సూర్యదేవుడు ఉత్తరాయణుడు అయ్యాడు. అనంతరం పితామహుడు తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఉత్తరాయణంలో జీవి తన శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా.. ఆ వ్యక్తి జీవన్మరణ బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)