AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasa Sarovaram: ప్రాణాలకు తెగించి మరీ యాత్ర.. అసలు ఏముంది ఆ కైలాస మానస సరోవరంలో..?

2020 నుంచి ఆగిపోయిన కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత అధికారులు రూపొందిస్తున్నారు.

Manasa Sarovaram: ప్రాణాలకు తెగించి మరీ యాత్ర.. అసలు ఏముంది ఆ కైలాస మానస సరోవరంలో..?
Manasa Sarovaram
Balaraju Goud
|

Updated on: Jan 28, 2025 | 8:23 PM

Share

కైలాస మానస సరోవర యాత్ర.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. జీవన్ముక్తి యాత్ర. జీవన సాఫల్యయాత్ర. అదో ఆధ్యాత్మిక ప్రయాణమే అయినా.. అంతుచిక్కని రహస్యం దాగుందేమో అనిపిస్తుంది ఆ ప్రయాణంలో. వైజ్ఞానిక ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచే ఓ మార్మిక గ్రంథాలయం..! కైలాస, మానస సరోవరం. పరమపావణమైన ఆ ప్రదేశం భూమికి, స్వర్గానికి వారధి అని హిందువుల నమ్మకం. ఈ అనంత విశ్వానికే కేంద్రకం ఆ కైలాస పర్వతం అని జైనుల నమ్మకం. కాదూ.. ఈ విశ్వాన్ని నడిపించే నావ లాంటిది అని బౌద్ధుల విశ్వాసం. అసలు కైలాస మానస సరోవరాలను చూడ్డం కాదు.. వాటి గురించి చదవడమూ అంత తేలికైన విషయం కాదంటారు జగ్గీ వాసుదేవ్‌ లాంటి వారు. మానస సరోవర యాత్రకు అనుమతి ఎంత చదువుకున్నా, ఎంత తెలివివంతుడవైనా.. ఆ మార్మికమైన ప్రపంచంలోకి అడుగుపెడితే.. అంతా అయోమయంగా అనిపించి, మళ్లీ అఆల అభ్యాసాన్ని మొదలు పెట్టాలేమో అనిపించే ఓ భావన కలుగుతుందని చెబుతుంటారు. అలాంటి కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్లుగా నిలిచిపోయింది. కారణం.. కరోనా అని చెప్పాల్సి వచ్చినా చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఒకటి. 2020లో చివరిసారిగా కైలాస పరిక్రమణ, మానస సరోవర యాత్రకు అనుమతి ఇచ్చింది చైనా. మళ్లీ ఇన్నాళ్లకు.. చైనాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చల ఫలితంగా.. యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అన్నీ అనుకూలిస్తే.. వచ్చే మే, జూన్‌ నెల...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి