AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanurmasa 2022: ధనుర్మాసంలో విష్ణువుని ఎందుకు పూజిస్తారు.. బ్రహ్మి ముహర్తం అని ఎందుకు అంటారో తెలుసా..

పంచాంగం ప్రకారం సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణ పుణ్యకాలము.. దక్షిణాయన పుణ్యకాలము.  మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు. మార్గశిర మాసం దక్షిణాయన శుభ ఋతువులో వస్తుంది.

Dhanurmasa 2022: ధనుర్మాసంలో విష్ణువుని ఎందుకు పూజిస్తారు.. బ్రహ్మి ముహర్తం అని ఎందుకు అంటారో తెలుసా..
Dhanurmasa 2022
Surya Kala
|

Updated on: Dec 20, 2022 | 5:07 PM

Share

ధనుర్మాస మాసంలో బ్రహ్మీ ముహూర్తంలో దేవతలందరూ తమ తమ దేవుణ్ణి పూజిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. ఈ ధనుర్మాసం దేవతల పూజకు అంకితమైన మాసం. విష్ణుమూర్తి, గోదాదేవిని ఈ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. సూర్యుని గమనం ప్రకారం ధనుర్మాసం ఈ నెల డిసెంబర్ 16న ప్రారంభమై జనవరి 14న ముగుస్తుంది. హిందూ క్యాలెండర్‌లోని 12 నెలల్లో మార్గశిర మాసం దేవతా ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాంద్రమాన మాసాలలో..  మార్గశిర మాసం సౌర క్యాలెండర్‌లో 9వ మాసం ధనుర్మాసం అంటారు. అందుకే ఈ మాసంలో శ్రీమహావిష్ణువు ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

డిసెంబర్-జనవరి నెలలు వచ్చే కొద్దీ చలి ప్రభావం పెరుగుతుంది. ఈ చలి నుంచి రక్షణ కోసం వెచ్చగా ఉండేందుకు అందరూ ఉన్ని దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. సాధారణంగా ధనుర్మాసాన్ని చలి కాలంలో జరుపుకుంటారు. తెల్లవారుజామున పొద్దున్నే లేచి దేవుణ్ణి ప్రార్థించి పూజధికార్యక్రమాలు నిర్వహించి అప్పుడు మిగతా పనులు నిర్వహిస్తారు

చాలా మంది నెల, రోజు, గంటలతో సంబంధం లేకుండా తమ పనులు తమకు కావలసిన సమయానికి ప్రారంభిస్తారు. మరికొందరు సగం అటువైపు, ఇటువైపు సగం అన్నట్లుగా ఉంటారు. తమ సౌలభ్యం ప్రకారం ప్రతిదీ అనుసరిస్తారు. మరికొందరు తమ ఇంటి పూజారులు చెప్పిన మాటలను తప్పకుండా పాటిస్తారు. రాహుకాల, యమగండకాలలో పనులు ప్రారంభించరు. వాస్తు ప్రకారం సరైన దిశలో నిలబడి/కూర్చుని పని ప్రారంభిస్తారు. ధనుర్మాసాన్ని చాలా మంది శూన్య మాసం అని అంటారు. అయితే ధనుర్మాసం అన్ని పనులకు చాలా శ్రేష్ఠమైన మాసం. ధనుర్మాసాన్ని మార్గశీర్ష మాసం అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

శ్రీకృష్ణునికి ప్రీతికరమైన మాసం

కృష్ణ భక్తులకు ఇది చాలా ప్రీతికరమైన మాసం. ఎందుకంటే కృష్ణుడు తిరుమల క్షేత్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి రూపంలో భూలోకంలో నివసిస్తున్నాడని విశ్వాసం. భూదేవి ఆండాళ్ళు గా ఒక సాధారణ అమ్మాయిగా అవతరించి.. తన ప్రియమైన వేంకటేశ్వర స్వామికి భక్తురాలైంది. ప్రతిరోజూ తులసి మాలను కట్టి.. ఆ మాలను మొదట తాను ధరించేది. అనంతరం ఆ దండను రంగనాథుడు  మెడలో వేసేది. ఈ శుభ మాసంలోనే గోదాదేవి తన ప్రేమికుడు రంగనాథుడుకి కోసం తమిళంలో తిరుప్పావై ముప్పై పద్యాలను రచించింది. నేటికీ శ్రీ వైష్ణవులు వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన తిరుప్పావై పాశురాలను పఠిస్తారు.

ఈ మాసంలో ఏ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లినా, తిరుమల ఆలయంలో కూడా గోదాదేవి ప్రణయ ప్రబంధాన్ని చెప్పి దేవుడిని నిద్రలేపడం చూడవచ్చు. గోదాదేవి స్వామివారిని నిద్రపుచ్చడానికి అతని కోసం స్వరపరిచిన లాలిపాటను పాడింది. భగవంతుడిని ప్రేమించడానికి మనకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆండాళ్ రూపంలో ఉన్న భూదేవి ప్రతిరోజూ ఆలయం ముందు కూర్చుని స్వామివారిపై ప్రేమతో పాటలు పాడుతూ స్వామిని ప్రసన్నం చేసుకునేది. ధనుర్మాసంలో రంగనాథుడు ఆండాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈ మాసం భగవంతుడికి ప్రీతికరమైనది.

దేవతల బ్రాహ్మీ ముహూర్తం

పంచాంగం ప్రకారం సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణ పుణ్యకాలము.. దక్షిణాయన పుణ్యకాలము.  మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు. మార్గశిర మాసం దక్షిణాయన శుభ ఋతువులో వస్తుంది. దేవతలకు ఉత్తరాయణ పుణ్యకాల ఉదయం దక్షిణాయన పుణ్యకాలం రాత్రి. కనుక ఈ మాసం రాత్రి ముగిసే సమయం.. కనుక మనం బ్రహ్మీముహూర్తం అని పిలుస్తాం. ఈ మాసమంతా బ్రహ్మ ముహూర్తం ఉన్న సమయం కనుక ఈ మాసంలో దేహ చింతన వదిలి.. చల్లగా ఉన్నా నదిలో చన్నీటి స్నానం చేసి, భగవంతుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ సమయంలో దైవ చింత మాత్రమే చేయాలనీ పురాణం కథనం కనుక వివాహం, నామకరణం, బ్రహ్మోపదేశం, ఇంటి స్థలం కొనుగోలు వంటివాటిని చేయరు కనుక ఈ నెలను శూన్య మాసంగా పరిగణిస్తారు.

శూన్యమాసం అంటే ఏమిటి?

పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే ఇది శనికి సంబంధించిన మాసం. ఆ మాసంలో ఏ పని చేసినా ఫలితం శూన్యం అని నమ్ముతారు. ఈ శూన్యమాసం సాధారణంగా జూన్, జూలై, ఆగస్టులో ఏదైనా నెలలో వస్తుంది. దీనినే ఆషాఢ మాసం అని కూడా అంటారు. ఆషాఢ నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ముగిసి దక్షిణాయ పుణ్యకాలములోనికి ప్రవేశిస్తాము.

ధనుర్మాసంలో చలి నుండి తప్పించుకోవడానికి మనిషి విల్లులా వంగి చేతులు ముడుచుకోవడం ఇష్టం. ఈ వాతావరణం ఫలితంగా మానవుని రోజువారీ కార్యకలాపాలలో విసర్జక అవయవాల ప్రక్రియ వంటి అసాధారణతలు కనిపిస్తాయని వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. దీన్నే సీజనల్ అలర్జీ అంటారు. వీటి నివారణకు ధనుర్మాసంలో తెల్లవారుజామున స్నానాలు ముగించాలని మన ప్రాచీనులు చెప్పారు.

తర్వాత చల్లటి గాలి వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంది. అందువల్ల, చలి మొదలయ్యే ముందు, స్నానం ముగించిన తర్వాత శరీరనికి వెచ్చదనం ఇచ్చేలా దుస్తులు ధరిస్తాం. ఈ సమయంలో తినే ప్రధాన ఆహారాలను శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతను పెంచి తాత్కాలిక రుగ్మతలను నివారించేవిగా ఉంటాయి. ఇవి రోజువారీ విసర్జన పనితీరును సహజంగా జరిగేలా చేస్తాయి. ఈ విధంగా, ధనుర్మాసాన్ని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఆహారం, ఆచారాలు రెండింటినీ జోడించారు పెద్దలు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us