AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ఆ రాష్ట్రంలో కరోనా భయం.. లాక్ డౌన్ పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు.. నో మాస్క్.. నో ఎంట్రీ అంటోన్న ప్రముఖ దేవాలయాలు

మహారాష్ట్రలోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు పెట్టింది. మాస్క్ ను ధరించడం తప్పని సరి చేసింది. మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి రాకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పలువురు అధికారులు ప్రజలను భక్తులను కోరుతున్నారు. 

Corona Virus: ఆ రాష్ట్రంలో కరోనా భయం.. లాక్ డౌన్ పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు.. నో మాస్క్..  నో ఎంట్రీ అంటోన్న ప్రముఖ దేవాలయాలు
Corona Virus Alert In Mahar
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2022 | 2:19 PM

గత మూడేళ్ళుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మళ్ళీ సరికొత్త వేరియంట్ రూపాన్ని సంతరించుకుంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ భయాన్ని పెంచుతోంది. చైనాలో ఒక్కరోజులోనే కరోనా కేసులు కోట్లకు చేరాయి. చైనా బాటలో అమెరికా కూడా అనుసరిస్తోంది. జపాన్, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఓవైపు క్రిస్మస్ సెలవులు ప్రారంభమయ్యాయి.. మరో వైపు కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లోనూ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో మహారాష్ట్రలోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు పెట్టింది. మాస్క్ ను ధరించడం తప్పని సరి చేసింది.

షిర్డీలోని సాయిబాబా ఆలయం, శనిసింగనాపూర్ ఆలయంలో కరోనా ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దేవాలయాధికారులు మాట్లాడుతూ.. మాస్క్ లేకపోతే సాయిబాబా ఆలయంలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. తుల్జాభవానీ దేవాలయం గురించి మాట్లాడుతూ..  ఉద్యోగులు మాస్క్ ధరించడం ప్రారంభించారని.. అయితే దేవి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇప్పటికీ  మాస్కులు లేకుండా చేరుకుంటున్నారని తెలిపారు. భక్తులు నిబంధనలు నిదానంగా తెలుసుకుంటున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆలయ సిబ్బందిసహా భక్తులు కోవిడ్ వ్యాప్తి నివారణకు కఠిన ఆంక్షలు అమలు చేయాలనీ పేర్కొన్నారు.

కొన్ని ఆలయ నిర్వాహకులు మాస్క్ ని ఉచితంగా ఇస్తున్నారు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో ఖచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు, ఆలయ సిబ్బంది ముందు మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కల్‌కోట్‌లోని శ్రీ స్వామి సమర్థ ఆలయంలో కూడా మాస్క్‌లు తప్పని సరి చేశారు. భక్తులు మాస్క్ ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని ఆలయ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించకుండా ఆలయానికి చేరుకున్న భక్తులకు దేవస్థానం వారు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాసిక్ జిల్లాలోనే సప్తశృంగి దేవి ఆలయంలో నో మాస్క్, నో ఎంట్రీ అనే నిబంధన కూడా అమలులోకి వచ్చింది. భక్తుల మధ్య సురక్షితమైన దూరం పాటించడంపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ట్రస్టు ఉద్యోగులు భక్తులను  క్యూ లైన్లలో తగినంత దూరం పాటించాలని సూచిస్తున్నారు. కొల్హాపూర్‌లోని అంబాబాయి ఆలయంలో కూడా మాస్కులను తప్పని సరి చేశారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగులు, పూజారులు మాస్క్‌లలో మాత్రమే ఆలయంలోకి రావాలని సూచించారు.  అయితే ఇక్కడి భక్తులకు మాస్క్ లు ధరించాలని అనే నిబంధన అమలు చేయలేదు.. మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి రాకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పలువురు అధికారులు ప్రజలను భక్తులను కోరుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..