AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల వారణాసి ఆధ్యాత్మిక పర్యటన.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించామన్న ఎమ్మెల్సీ కవిత

వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన..

ముగిసిన సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల వారణాసి ఆధ్యాత్మిక పర్యటన.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించామన్న ఎమ్మెల్సీ కవిత
K Sammaiah
|

Updated on: Jan 29, 2021 | 6:53 PM

Share

వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. శుక్రవారం వేకువజాము నుండి పలు దేవాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయాన్ని దర్శించుకుని, ఆచార్య దీపక్ మాల్వియా ఆధ్వర్యంలో అన్నపూర్ణదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాత దుందిరాజ్ ఆలయం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, గణనాథుని దర్శించుకున్నారు. ఆచార్య దీపక్ మాల్వియా, శంకర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ‘గణేష్ పూజ’ లో ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామి వారికి పుష్పాభిషేకం జరిపారు. అనంతరం వరాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు.

ఆ తరువాత తులసీ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ మరియు ఇతర కుటుంబ సభ్యులు, ప్రాచీన హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. చివరగా నిషర్ధన్ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన