AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వడ్డీకాసులవాడికి భూరి విరాళం ఇచ్చిన ముస్లిం దంపతులు.. చెక్కుని ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేత

స్వామివారికి హిందువులు మాత్రమే కాదు..ముస్లింలు కూడా భక్తులే.. వెంకటేశ్వర స్వామిని విశ్వసించి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారన్న సంగతి తెలిసిందే. కడపలోని వెంకటేశ్వర స్వామిని అయితే తమ ఇంటి అల్లుడిగా భావించే ముస్లింలు ఉన్నారు.

Tirumala: వడ్డీకాసులవాడికి భూరి విరాళం ఇచ్చిన ముస్లిం దంపతులు.. చెక్కుని ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేత
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Sep 20, 2022 | 5:31 PM

Share

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara swamy) కొలువైన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. భక్తులు కోరిక కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. వెంకన్నను దర్శించుకుని జన్మ చరితార్థం అయిందని భావిస్తారు. స్వామివారికి హిందువులు మాత్రమే కాదు..ముస్లింలు కూడా భక్తులే.. వెంకటేశ్వర స్వామిని విశ్వసించి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారన్న సంగతి తెలిసిందే. కడపలోని వెంకటేశ్వర స్వామిని అయితే తమ ఇంటి అల్లుడిగా భావించే ముస్లింలు ఉన్నారు. పండగలు, పర్వదినాల సమయంలో వెంకన్నని తమ ఇంటికి ఆహ్వానిస్తూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. కానుకలు సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తిరుమలలోని శ్రీవారిని చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ ముస్లిం దంప‌తులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం టీటీడీకి సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి  దాత‌లు విరాళం చెక్కును అందించారు.

తాము ఇచ్చిన విరాళంలో నగదును ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు వినియోగించాలని.. ఇక తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లను ఉపయోగించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి