AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath: భక్తులకు బిగ్ అలర్ట్..! అమర్‌నాథ్ యాత్ర రద్దు.. రెండు మార్గాలు మూసివేత..!

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు వెళ్లే యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Amarnath: భక్తులకు బిగ్ అలర్ట్..! అమర్‌నాథ్ యాత్ర రద్దు.. రెండు మార్గాలు మూసివేత..!
Amarnath Yatra
Balaraju Goud
|

Updated on: Jul 18, 2026 | 10:28 PM

Share

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు వెళ్లే యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అధికారుల నిర్ణయం ప్రకారం జూలై 19 నుంచి బల్తాల్ బేస్ క్యాంప్, నున్వాన్–చందన్‌వారి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు అనుమతించరు. ప్రస్తుతం బేస్ క్యాంపుల్లో ఉన్న యాత్రికులకు కూడా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత, యాత్ర మార్గాల భద్రతను పూర్తిగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాత్ర నిర్వహణ కమిటీ వెల్లడించింది.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ-కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో భూస్ఖలనం, రాళ్లు జారిపడే ప్రమాదం పెరిగిందని అధికారులు తెలిపారు. యాత్ర మార్గంలో ప్రయాణించే భక్తుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, యాత్రికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. యాత్ర తిరిగి ప్రారంభించే తేదీని వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరే భక్తులు అధికారిక ప్రకటనలు, స్థానిక పరిపాలన, యాత్ర నిర్వహణ కమిటీ సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి యాత్రికులు సహకరించాలని అధికారులు కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us