AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

హిందూ శాస్త్ర ప్రకారం, గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటిస్తారు. అయితే 2026 సంవత్సరంలో చంద్ర గ్రహణం రోజే రాఖీ పండుగ వచ్చేస్తోంది. కాగా, ఇప్పుడు మనం ఏ సమయంలో రాఖీ కట్టాలో వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 3:32 PM

Share
ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది.

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది.

1 / 5
అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందువలన భారత దేశంలో రాఖీ పండుగ జరుపుకోవడానికి , గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ సమయంలోనైనా సరే రాఖీ కట్టుకోవచ్చునంట.

అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందువలన భారత దేశంలో రాఖీ పండుగ జరుపుకోవడానికి , గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ సమయంలోనైనా సరే రాఖీ కట్టుకోవచ్చునంట.

2 / 5
హిందూ ప్రజలు ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండుగ వేడుకను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. అంతే కాకుండా స్వీట్ పంచి, కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సంవత్సరం పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి, ఆగస్టు 28 శుక్ర వారం 9.48 వరకు ఉంటుంది.

హిందూ ప్రజలు ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండుగ వేడుకను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. అంతే కాకుండా స్వీట్ పంచి, కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సంవత్సరం పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి, ఆగస్టు 28 శుక్ర వారం 9.48 వరకు ఉంటుంది.

3 / 5
అయితే పండితులు, ఉదయ తిథిని బట్టి ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలని సూచించడం జరిగింది. ఇక ఈ రోజు10.46 నిమిషాల నుంచి, మధ్యాహ్నం 12.22 నిమిషాల వరకు రాహు కాలం, ఉంటుంది. ఈ రోజున భద్ర దోషం లేకపోవడం వలన ఏ సమయంలో రాఖీ కట్టినా శుభప్రదం. వీలైనంత వరకు ఉదయం 9.48 నిమిషాల వరకు రాఖీ కట్టుకోవడం చాలా మంచిదంట.

అయితే పండితులు, ఉదయ తిథిని బట్టి ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలని సూచించడం జరిగింది. ఇక ఈ రోజు10.46 నిమిషాల నుంచి, మధ్యాహ్నం 12.22 నిమిషాల వరకు రాహు కాలం, ఉంటుంది. ఈ రోజున భద్ర దోషం లేకపోవడం వలన ఏ సమయంలో రాఖీ కట్టినా శుభప్రదం. వీలైనంత వరకు ఉదయం 9.48 నిమిషాల వరకు రాఖీ కట్టుకోవడం చాలా మంచిదంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us