AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2022: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..

Makar Sankranti 2022-megasgtar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి రోజున వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదారంగనాథుల కల్యాణ..

Makar Sankranti 2022: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..
Chiranjeevi At Godadevi Kalyanam
Surya Kala
|

Updated on: Jan 15, 2022 | 1:01 PM

Share

Makar Sankranti 2022-megasgtar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి రోజున వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా కృష్ణా జిల్లా డోకిపర్రుకి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో, సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వర్గాలు, వేదపండితులు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. వేదపండితులు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు.

గోదా దేవి కళ్యాణం అనంతరం చిరంజీవి దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, తీర్ధ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కళ్యాణ వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం సహా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌, డైరీలను మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు. గోదాదేవి కళ్యాణ ఉత్సవం పాల్గొనడం తన అదృష్టమని చిరంజీవి చెప్పారు. తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణం అనంత్సరం చిరంజీవి,సురేఖ దంపతులు డోకిపర్రు గ్రామంలో బస చేశారు. ఈ రోజు ఉదయం (శనివారం) ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌ కు చేరుకున్నారు.