ఆ అడవి పందులను వధించవచ్చు.. సర్పంచులకు విచక్షణాధికారం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
అడవి పందుల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తియ్యడమే కాకుండా, పంటను నాశనం చేస్తున్న అడవి పందులను...

అడవి పందుల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తియ్యడమే కాకుండా, పంటను నాశనం చేస్తున్న అడవి పందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో సర్పంచులను గౌరవ వైల్డ్లైఫ్ వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972లోని సెక్షన్ 4(3) ప్రకారం ఈ నియామకం జరిపింది. ఈ మేరకు అటవీశాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అటవీయేతర, రక్షిత ప్రాంతాల్లో మాత్రమే అడవిపందులను చంపేందుకు మాత్రమే సర్పంచ్లకు అనుమతులు లభించాయి. వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్ ఉండాలి, కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనివల్ల కొందరు అడవిపందులను విచక్షణారహితంగా వధిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్
హైదరాబాద్లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు