AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ, వైసీపీ పార్టీలు మేనిఫెస్టోను ఎందుకు ప్రకటించడంలేదు?

విజయవాడ: ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఎన్నికల మేనిఫెస్టోలను ఇంకా ప్రకటించడంలేదు. విడుదల చేయడానికి ఇరు పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఒకరి మేనిఫెస్టో కోసం మరొకరు వేచి చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ముందు విడుదల చేసిన వారిని చూసి మార్పులు చేర్పులు చేసి ఆకర్షణీయంగా మేనిఫెస్టోను తెచ్చేందుకు వేచి చూస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇందులో వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు తుది మేనిఫెస్టోను […]

టీడీపీ, వైసీపీ పార్టీలు మేనిఫెస్టోను ఎందుకు ప్రకటించడంలేదు?
Vijay K
|

Updated on: Mar 23, 2019 | 10:54 AM

Share

విజయవాడ: ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఎన్నికల మేనిఫెస్టోలను ఇంకా ప్రకటించడంలేదు. విడుదల చేయడానికి ఇరు పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఒకరి మేనిఫెస్టో కోసం మరొకరు వేచి చూస్తున్న ధోరణి కనిపిస్తోంది.

ముందు విడుదల చేసిన వారిని చూసి మార్పులు చేర్పులు చేసి ఆకర్షణీయంగా మేనిఫెస్టోను తెచ్చేందుకు వేచి చూస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇందులో వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు తుది మేనిఫెస్టోను పరిశీలించి ఓకె చేసినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల చేయస్తున్నామని ప్రకటించిన చంద్రబాబు ఇంకా విడుదల చేయలేదు.

తమ హామీలను టీడీపీ కాపీ కొడుతుందని, నవరత్నాల విషయంలో అలానే జరిగిందని వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. టీడీపీ విడుదల చేసిన తర్వాతనే విడుదల చేయాలని వైసీపీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే శనివారం సాయింత్రానికి మేనిఫెస్టోల అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.