Sasikala: రెండాకుల పార్టీ హైటెన్షన్.. పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్లాన్లో చిన్నమ్మ..
చిన్నమ్మ టెన్షన్ రెండాకుల పార్టీని భయపెడుతోంది. ఇవాళ్టికి అన్నాడీఎంకే 50ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జయ మెమోరియల్కు చేరుకోనున్న నేతలు..
చిన్నమ్మ టెన్షన్ రెండాకుల పార్టీని భయపెడుతోంది. ఇవాళ్టికి అన్నాడీఎంకే 50ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జయ మెమోరియల్కు చేరుకోనున్న నేతలు.. అమ్మకు నివాళులర్పించనున్నారు. అయితే.. 50ఏళ్ల వేడుకల వేళ అన్నాడీఎంకేలో శశికళ కలవరం మొదలైంది. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు చిన్నమ్మ ప్రయత్నిస్తుండటంతో ఆందోళన స్టాట్ అయింది. శశికళ రీఎంట్రీతో తమిళనాడు పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.
1972లో అన్నా ద్రావిడ మున్నెట్ర కళగం పార్టీని స్థాపించారు ఎంజీఆర్. డీఎంకేలో కోశాధికారిగా ఉంటూ కరుణానిధితో విభేదించిన ఎంజీఆర్ తిరుగుబాటుతో పురుడు పోసుకుంది అన్నాడీఎంకే. ఎడిఎంకే. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితది అదే పరిస్థితి. ఎన్నో అటుపోట్ల తర్వాత పార్టీని కైవసం చేసుకున్నారు జయలలిత.
అయితే ఇప్పుడు పార్టీని క్యాప్చర్ చేసే దిశగా చిన్నమ్మ పావులు కదుపుతుండటంతో.. మళ్లీ అన్నాడీఎంకేలో అదే పరిస్థితి రానుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్కు సాఫ్ట్వేర్ అప్డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..
Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..