AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండి వైఖరి వల్లే రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
Minister Kishan Reddy
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2021 | 5:58 PM

Share

Minister Kishan Reddy – CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండి వైఖరి వల్లే రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ సీజన్‌లో ప్రతి బస్తాను కేంద్రం కొంటుందని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు.. మరోసారి వరి వద్దన్నారు.. వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌కు నిద్రపట్టని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పుత్ర వాత్సల్యంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ సీఎంపై వ్యాఖ్యలు చేశారు కిషన్‌రెడ్డి.

ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆందోళన చేస్తున్నారు. బాయిల్డ్‌ రైస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా హెచ్చరిస్తూనే ఉందన్నారు. ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించాలన్నారు. మేము బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వము అని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి రాసి ఇచ్చిందని అన్నారు.

రేషన్‌ బియ్యాన్ని రీసైకిల్‌ చేసి వాటినే FCI ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు వల్ల కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించాలి. పుత్రవాత్సల్యం కోసం రైతులకు ఆగం చేయొద్దు. భాజపాపై వ్యతిరేకత పెంచేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. తెరపైకి కొత్తగా గంగాధర్‌ రెడ్డి కామెంట్స్..