‘తప్పు చేశా, తప్పు చేశా’, చెవులు పట్టుకుని గుంజీలు తీసిన మాజీ టీఎంసీ నేత
బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దాదాపు రోజుకో రకం వింతలు, విడ్డూరాలలోకిక కొదవ లేదు. ఆ కోవలోదే ఇది ! తృణమూల్ l కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి....
బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దాదాపు రోజుకో రకం వింతలు, విడ్డూరాలలోకిక కొదవ లేదు. ఆ కోవలోదే ఇది ! తృణమూల్ l కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి..బుధవారం బీజేపీలో చేరిన సుశాంత్ పాటిల్ అనే ఆయన ..తాను చేసిన’పాపానికి ప్రాయశ్చిత్తంగా’ తన చెవులు రెండూ పట్టుకుని గుంజీలు తీసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. బీజేపీ నేత సువెందు అధికారి, ఇతరులు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన స్టేజీపైనే ఇలా చేసి వార్తలకెక్కారు. మెడిన్ పూర్ లోని పింగ్లా ర్యాలీ సందర్భంగా ఈ విచిత్ర ‘సంఘటన’ జరిగింది. తాను 2005 నించి టీఎంసీలో ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేస్తూ వచ్చానని, కానీ పార్టీలో తన సేవలను ఎవరూ గుర్తించలేదని సుశాంత్ పాటిల్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కే ఓటు వేయాలని ఓటర్లను కోరి పెద్ద తప్పు చేశానని , ఇప్పుడు ఇలా చెవులు పట్టుకుని, గుంజీలు తీయడంద్వారా తన ‘పాప’ ప్రక్షాళన జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకెంతో స్వేఛ్చ లభించిందన్నారు. ఆయన ఇలా గుంజీలు తీస్తుంటే సువెందు అధికారి, ఇతర నేతలు వారించకుండా చూస్తూ ఉండిపోయారు.
అటు-సుశాంత్ పాటిల్ ని నాలుగేళ్ల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజిత్ మైతీ తెలిపారు. ఆయన బీజేపీలో చేరుతారని తాము ముందే ఊహించామన్నారు. ‘బీజేపీ సంస్కృతే అది..కొందరు కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరితే మరి కొందరు ఇలా గుంజీలు తీస్తూ చేరుతారు’ అని అజిత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎంతమంది టీఎంసీని వీడినా తమ పార్టీకి నష్టం లేదన్నారు. కాగా బెంగాల్ ఎన్నికలకోసం అప్పుడే బీజేపీ తన వ్యూహరచన ప్రారంభించింది. నిన్న పార్టీ కొర్ కమిటీ భేటీ కాగా- గురువారం పార్టీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. త్వరలో బెంగాల్ ఎన్నికల తొలి, రెండో దశ ఎన్నికలకు పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
India vs England 4th Test Live: అయ్యో అప్పుడే…! తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..