AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు.. ఇలా ఈజీగా ఇచ్చెయ్యొచ్చుగా : నారా లోకేష్

ఆదివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన వైయస్ఆర్ పెన్షన్ పంపిణీ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు...

Nara Lokesh: అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు.. ఇలా ఈజీగా ఇచ్చెయ్యొచ్చుగా : నారా లోకేష్
నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయన్నారు.
Venkata Narayana
|

Updated on: Aug 01, 2021 | 10:23 PM

Share

Nara Lokesh: ఆదివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన వైయస్ఆర్ పెన్షన్ పంపిణీ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు సూటి ప్రశ్నలు సంధించారు నారా లోకేష్. ” అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు జగన్ రెడ్డి గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామ‌ని.. రూ.250 పెంచి ఆగిపోయారు. ఒక‌టో తారీఖునే త‌లుపులు ఇర‌గ్గొట్టి మ‌రీ పెన్షన్ గ‌డ‌ప‌కే ఇస్తామ‌న్న ప్రగ‌ల్భాలు ఏమ‌య్యాయి?” అని లోకేష్ ప్రశ్నించారు.

“ఈ రోజు 1వ తేదీ.. 5 ల‌క్షల మందికి పైగా పింఛ‌న్లు అంద‌లేదు. ప్రతీనెలా టెక్నిక‌ల్ ప్రాబ్లమేనా? అప్పు దొర‌క‌డంలేదా? అంట మీకు ఇవ్వాల‌నే మ‌న‌సుండాలే కానీ, మీ ద‌గ్గరే ల‌క్షల కోట్లు మూలుగుతున్నాయి. వాళ్లనీ, వీళ్లనీ అప్పులు అడ‌గ‌డం ఏమీ బాలేదు.” అని లోకేష్ చెప్పుకొచ్చారు.

“ఒక్క నెల జే ట్యాక్స్‌లో 10 శాతం వెచ్చిస్తే అంద‌రికీ పింఛ‌న్లు ఇచ్చేయొచ్చు. క్విడ్‌ప్రోకో ద్వారా కూడ‌గ‌ట్టిన‌ అక్రమాస్తులలో 1 శాతం అమ్మితే ఏపీ అప్పుల‌న్నీ తీరిపోతాయి. పింఛ‌న్లు లేటు చేస్తే, పెంపు గురించి అడ‌గ‌ర‌నే లాజిక్‌తో పింఛ‌న్ ఇచ్చే ఒక‌టో తేదీని అలా అలా పెంచుకుంటూ పోతున్నారా జ‌గ‌న్ రెడ్డి గారు!” అంటూ ఎద్దేవా చేశారు లోకేష్.

Read also: Padi Koushik Reddy: నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం