AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసూద్‌ని ‘జీ’ అని సంబోధించిన రాహుల్.. విరుచుకుపడుతున్న బీజేపీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నోరుజారి చిక్కుల్లో పడ్డారు. బీజేపీ ఎప్పుడు రాహుల్ గాంధీ చిక్కుతారా అని వేచి చూస్తున్న తరుణంలో మరోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుని బీజేపీకి దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ను.. మసూద్‌ని ‘జీ’ అంటూ గౌరవంగా సంబోధించి చిక్కుల్లో పడ్డారు. రాహుల్ ఎప్పుడు చిక్కుతారా? అని చూసే బీజేపీకి ఇదో మంచి అస్త్రంలా […]

మసూద్‌ని ‘జీ' అని సంబోధించిన రాహుల్..  విరుచుకుపడుతున్న బీజేపీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 5:44 PM

Share

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నోరుజారి చిక్కుల్లో పడ్డారు. బీజేపీ ఎప్పుడు రాహుల్ గాంధీ చిక్కుతారా అని వేచి చూస్తున్న తరుణంలో మరోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుని బీజేపీకి దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ను.. మసూద్‌ని ‘జీ’ అంటూ గౌరవంగా సంబోధించి చిక్కుల్లో పడ్డారు. రాహుల్ ఎప్పుడు చిక్కుతారా? అని చూసే బీజేపీకి ఇదో మంచి అస్త్రంలా మారింది. అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘జీ’ అంటూ సంబోధించడమేంటని బీజేపీ ఏకి పారేస్తోంది. దీనిలో భాగంగా కాందహార్ ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మసూద్ ‘జీ’ని అప్పటి ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని.. ఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లో స్వయంగా కాందహార్ వెళ్లి మరీ అప్పగించారని తెలిపారు. దీంతో బీజేపీ.. రాహుల్‌కూ, పాక్‌కూ ఉగ్రవాదులంటే అమితమైన ప్రేమ అని అంతర్జాతీయ టెర్రరిస్టును ‘జీ’ అంటూ సంబోదిస్తారా? అంటూ విరుచుకుపడింది. టెర్రరిస్టులను గౌరవించడమంటే పరోక్షంగా పుల్వామా అమరవీరులను అవమానించడమేనంటూ స్మృతి ఇరానీ.. రాహుల్‌ని విమర్శించారు.