AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక టూ తమిళనాడు వయా ఆంధ్ర..ఈవీఎంలే టార్గెట్‌గా బాబు

ఏపీలో పోలింగ్‌ ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంల పనితీరుపై విపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేసిన చంద్రబాబు…ఇవాళ తమిళనాడులో డీఎంకేకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కూడా చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం అనంతరం […]

కర్ణాటక టూ తమిళనాడు వయా ఆంధ్ర..ఈవీఎంలే టార్గెట్‌గా బాబు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 16, 2019 | 4:59 PM

Share

ఏపీలో పోలింగ్‌ ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంల పనితీరుపై విపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేసిన చంద్రబాబు…ఇవాళ తమిళనాడులో డీఎంకేకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కూడా చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం అనంతరం మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇక చెన్నై వేదికగా కూడా మరోసారి ఈవీఎంల లోపాలపై గళమెత్తనున్నారు చంద్రబాబు. ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమతో కలిసి రావాల్సిందిగా స్టాలిన్‌ను కోరనున్నారు చంద్రబాబు.