AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రగతి భవన్‌లో మొక్కలు నాటిన కేటీఆర్‌.. కోటి వృక్షార్చనలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా టీం చేపట్టిన 'కోటి వృక్షార్చ‌న' కార్య‌క్ర‌మం..

ప్రగతి భవన్‌లో మొక్కలు నాటిన కేటీఆర్‌.. కోటి వృక్షార్చనలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
K Sammaiah
|

Updated on: Feb 17, 2021 | 3:55 PM

Share

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా టీం చేపట్టిన ‘కోటి వృక్షార్చ‌న’ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతమైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పాటు హ‌రిత ప్రేమికులు పాల్గొని మొక్క‌లు నాటారు.

ఒక్క గంటలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రకటించారు. తాము ఊహించినదానికంటే ఎక్కువ స్పందన తెలంగాణ ప్రజల నుంచి వచ్చిందని చెప్పారు.

ఇక కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కూడా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొక్కలు నాటారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి కేటీఆర్‌ మొక్క‌లు నాటారు. కేటీఆర్ భార్య శైలిమ‌, కూతురు అలేఖ్య ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Read more:

తెలంగాణలో విజయవంతమైన ‘కోటి వృక్షార్చన’.. ఇంతకీ సీఎం కేసీఆర్ ఏ మొక్క నాటారో తెలుసా..?