AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి

ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అందరూ క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..రాష్ట్రాల సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించాలని, జీడీపీ లక్ష్యం పెంచడంపై కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో పని చేయాల్సిన […]

5 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2019 | 6:32 PM

Share

ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అందరూ క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తిగా అవతరించడం సవాలైనా..రాష్ట్రాల సమిష్టి కృష్టితో సాధ్యమేనని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించాలని, జీడీపీ లక్ష్యం పెంచడంపై కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా శనివారంలో ఢిల్లీలో జరిగిన మీటింగ్  ప్రధాని మోదీ అధ్యక్షతన ఇది ఐదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశంలో మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో ఎన్నికలు పూర్తయ్యాయని..ఇక దేశాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఐతే తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.