AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనుల, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన […]

పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 8:04 PM

Share

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.

పోలవరం ప్రాజెక్టు పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనుల, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అంతేగాకుండా పాత కాంట్రాక్టర్‌కే ఇస్తారో.. లేక కొత్త కాంట్రాక్టర్‌నే నియమిస్తారో త్వరగా తేల్చాలని కూడా ప్రభుత్వానికి సూచించింది కమిటీ. న్యాయపరమైన చిక్కులు తెలెత్తకుండా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది.

నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థకు ఇప్పటికే ప్రీక్లోజర్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్‌ పనులు చేస్తోంది నవయుగ. 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ వర్క్స్‌తో పాటు.. మూడువేల 220 కోట్ల విలువైన విద్యుత్ టెండర్లు కూడా దక్కించుకుంది. ఈ రెండింటి నుంచీ వెంటనే తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..