AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో  ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు  స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక […]

ఈసీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
Ram Naramaneni
|

Updated on: Apr 12, 2019 | 2:50 PM

Share

అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో  ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు  స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్‌ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఏ ప్రాతిపదికన నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు.  ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు.

వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్‌ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈవీఎం ఓటింగ్‌ నష్టాలపై సుప్రీంకు వెళ్లినా కూడా…అబద్దాలు చెప్పి బ్యాలెట్ పద్దతుల్లో ఓటింగ్ జరగకుండా చేశారని ఆరోపించారు. 5 కోట్లిస్తే ఒకడు ఈవీఎంలను తారుమారు చేసి ఎమ్మెల్యేలను చేస్తానంటున్నాడని…ప్రజాప్రతినిధుల భవిష్యత్‌ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని వివరించారు. ఉత్తరాంధ్ర, గోదావరి ప్రజలు సౌమ్యులుగా ఉంటారని…అక్కడ కూడా గొడవలు రెచ్చగొట్టారని సీఎం ఆరోపించారు.

ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!