మమతతో ముగిసిన భేటీ.. ఢిల్లీకి చంద్రబాబు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాల అంశాలపై ప్రధానంగా ఈఇద్దరి సీఎంల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఈవీఎంల కన్నా ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద […]

మమతతో ముగిసిన భేటీ.. ఢిల్లీకి చంద్రబాబు
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 8:59 PM

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాల అంశాలపై ప్రధానంగా ఈఇద్దరి సీఎంల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఈవీఎంల కన్నా ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు.