పార్టీలకు తలనొప్పిగా మారిన అభ్యర్ధుల ప్రకటన

విజయవాడ: ఏపీలో సీట్ల ప్రకటన పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది. సీటు దక్కని వాళ్లు తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ విషయంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో అభ్యర్దుల ప్రకటన చేసేందుకు టీడీపీ సిద్ధమయ్యింది. 16వ తేదీన జగన్ ఇడుపులపాయలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. అయితే ఈ లోపల తమకు సీటు రాదేమోననే ఆలోచనలతో పలువురు నేతలు అసమ్మతి […]

పార్టీలకు తలనొప్పిగా మారిన అభ్యర్ధుల ప్రకటన
Follow us

|

Updated on: Mar 14, 2019 | 4:20 PM

విజయవాడ: ఏపీలో సీట్ల ప్రకటన పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది. సీటు దక్కని వాళ్లు తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ విషయంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో అభ్యర్దుల ప్రకటన చేసేందుకు టీడీపీ సిద్ధమయ్యింది.

16వ తేదీన జగన్ ఇడుపులపాయలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. అయితే ఈ లోపల తమకు సీటు రాదేమోననే ఆలోచనలతో పలువురు నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. దీంతో అసమ్మతి నేతలకు పక్క జిల్లాలో సీట్లు కేటాయించేందుకు అధినేతలు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గంట గంటకూ పరిణామాలు మారుతున్నాయి.