తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ కేంద్రాలైన పాఠశాలలు, ఓటు వినియోగించుకునే ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. లెక్కింపు అనంతరం రెండో శనివారం, ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించవచ్చు. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.