AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష్ణు న్యూ వాయిస్.. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాదు

ఏపీలో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మూడు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇకపై యాంటీ మోదీ వేవ్ అనే ఆటలు సాగవని ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ అధికారం చేపడుతుందని.. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని […]

విష్ణు న్యూ వాయిస్.. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:46 PM

Share

ఏపీలో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మూడు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇకపై యాంటీ మోదీ వేవ్ అనే ఆటలు సాగవని ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ అధికారం చేపడుతుందని.. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని పేర్కొన్నారు. కాగా ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబును విష్ణు కుమార్ రాజు కలిశారు. ఆ మరుసటి రోజే తన సొంత పార్టీపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి విష్ణు కుమార్ మాటల వెనుక మర్మమేంటో ఆ పెరుమాల్‌కే తెలియాలి.