AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయం తెచ్చిన ఆనందం.. బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్

కర్ణాటకలో మూడు వారాల పాటు కొనసాగుతున్న టెన్షన్‌కు మంగళవారంతో తెరపడింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోవడంతో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేణుకాచార్య తన అనుచరులతో కలిసి డ్యాన్స్ వేశారు. అయితే కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్ష జరిగే సమయంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ పార్టీ మీటింగ్‌ జరుగుతోంది. ఇక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందన్న వార్తలు రావడంతో […]

విజయం తెచ్చిన ఆనందం.. బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 12:30 PM

Share

కర్ణాటకలో మూడు వారాల పాటు కొనసాగుతున్న టెన్షన్‌కు మంగళవారంతో తెరపడింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోవడంతో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేణుకాచార్య తన అనుచరులతో కలిసి డ్యాన్స్ వేశారు.

అయితే కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్ష జరిగే సమయంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ పార్టీ మీటింగ్‌ జరుగుతోంది. ఇక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందన్న వార్తలు రావడంతో అక్కడున్న వారు హోటల్‌ బయట టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఎమ్మెల్యే రేణుకాచార్య బయటకు వచ్చిన ఆయన ఆనందంతో డ్యాన్స్ వేశారు. అంతేకాదు అక్కడున్న తన అనుచరులు, కార్యకర్తలను కూడా డ్యాన్స్ వేయాలంటూ ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో దాదాపు మూడు వారాల పాటు కర్ణాటక రాజకీయాల్లో సీరియల్‌ను మించిన మలుపులు తిరిగాయి. ఇక మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 99 ఓట్లు రాగా.. బీజేపీకి 105పడ్డాయి. దీంతో కుమార ప్రభుత్వం పడిపోయింది. ఇక కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అయితే 1956లో కర్ణాటక ఏర్పడగా.. ఇప్పటి వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే తమ ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. వారిలో నిజలింగప్ప(1962-68), దేవరాజ్ అర్స్(1972-77), సిద్ధరామయ్య(2013-2018)లు ఉన్నారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?